AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohsin Naqvi: పీసీబీ చీఫ్‌కు మరోసారి ఘోర అవమానం.. అసలు ఈవెంట్‌కు రావాలని ఆయన్ను ఎవరు పిలిచారు?

Asia Cup 2026: ఆసియా కప్ ఫైనల్‌లో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ అందజేత వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. భారత మహిళా జట్టు ఆయన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. అయితే ఏసీసీ అధ్యక్షుడిగా నఖ్వీకి ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదని, పదవి హోదాలోనే కార్యక్రమానికి హాజరయ్యారని తెలుస్తోంది. శ్రీలంక రన్నరప్ బహుమతులు అందించిన అనంతరం ఆయన మైదానం వీడారు.

Mohsin Naqvi: పీసీబీ చీఫ్‌కు మరోసారి ఘోర అవమానం.. అసలు ఈవెంట్‌కు రావాలని ఆయన్ను ఎవరు పిలిచారు?
Mohsin Naqvi
Rakesh
|

Updated on: Sep 14, 2026 | 1:08 PM

Share

Mohsin Naqvi: దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి మరోసారి తీవ్ర అవమానం ఎదురైంది. భారత జట్టు ఆయన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఆయన నిస్సహాయ స్థితిలో వెనుదిరగాల్సి వచ్చింది. అసలు ఈ కార్యక్రమానికి ఆయన ఎలా హాజరయ్యారనే చర్చ ప్రస్తుతం క్రీడా వర్గాలలో జోరుగా సాగుతోంది. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయిలో వరుసగా రెండుసార్లు తీవ్రమైన పరాభవాలను ఎదుర్కొన్న వ్యక్తిగా మొహ్సిన్ నఖ్వీ నిలిచారు. గతంలో పురుషుల ఆసియా కప్ సమయంలో భారత జట్టు ఏ విధంగా వ్యవహరించిందో ఇప్పుడు మహిళా జట్టు కూడా అదే బాటలో నడిచింది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వారి చేతుల నుంచి ట్రోఫీని స్వీకరించబోమని బీసీసీఐ తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఈ టోర్నమెంట్‌ను నిర్వహించే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం నఖ్వీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను ప్రత్యేకంగా ఎవరూ ఆహ్వానించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సంస్థ అధిపతిగా ఆయనే స్వయంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టీమిండియా విజయం సాధిస్తే గతంలో మాదిరిగానే ట్రోఫీ ఇవ్వకుండా వివాదం మళ్లీ చెలరేగుతుందని అందరికీ ముందే తెలుసు. భారత బోర్డు అధికారులు కూడా తమ నిర్ణయాన్ని ముందే స్పష్టం చేశారు. అయినప్పటికీ మొహ్సిన్ నఖ్వీ మైదానానికి వచ్చి శ్రీలంక జట్టుకు రన్నరప్ చెక్కులు, పతకాలు అందజేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. భారత క్రీడాకారిణులు ట్రోఫీని తీసుకోరని స్పష్టమైనప్పటికీ ఆయన స్టేడియానికి వెళ్లడం ద్వారా ప్రపంచం ముందు మరోసారి నవ్వులపాలయ్యారు. ఈ పదవిలో ఆయన కొనసాగుతున్నంత కాలం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ క్రికెట్ మండలికి అధ్యక్షుడిగా గతంలో జై షా సేవలు అందించగా, ఆ తర్వాత ఆ పదవిని మొహ్సిన్ నఖ్వీ చేపట్టి కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ఆయన పదవీ కాలం ఉండటంతో ఇలాంటి అధికారిక కార్యక్రమాలకు ఆయన హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు సొంత దేశంలో క్రికెట్ బోర్డును నడిపిస్తూనే మరోవైపు ఇలాంటి ఘోర అవమానాలను ఎదుర్కొంటున్న తీరు చూస్తుంటే క్రీడా రంగంలో రాజకీయ జోక్యం ఎంతటి దుస్థితికి దారితీస్తుందో అర్థమవుతుంది. క్రీడా స్ఫూర్తిని విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం గనుకు పాకులాడితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us