AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 1st ODI : కోహ్లీ రోహిత్‎ల మ్యాజిక్..సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్

భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో, టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది.భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది.

IND vs SA 1st ODI : కోహ్లీ రోహిత్‎ల మ్యాజిక్..సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
Ind Vs Sa 1st Odi
Rakesh
|

Updated on: Nov 30, 2025 | 5:39 PM

Share

IND vs SA 1st ODI : భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో, టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో (135 పరుగులు), కెప్టెన్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మల హాఫ్ సెంచరీలు తోడవడంతో, భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది.

భారత జట్టు బ్యాటింగ్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ (18) త్వరగా ఔట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాళ్లు జట్టు ఇన్నింగ్స్‌ను పటిష్టం చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా మూడో హాఫ్ సెంచరీని (51 బంతుల్లో 57 పరుగులు) పూర్తి చేశాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో ఔట్ అవ్వడానికి ముందు.. రోహిత్, విరాట్ కోహ్లీతో కలిసి జట్టుకు బలమైన పునాది వేశాడు.

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. 102 బంతుల్లో 52వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ, తన ఇన్నింగ్స్‌ను 120 బంతుల్లో 135 పరుగుల వద్ద ముగించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌కు ముందు కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో 52 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

కోహ్లీ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సహకారం అందించాడు. కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 60 పరుగులు చేసి, కెప్టెన్‌గా తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య 100 పరుగుల భాగస్వామ్యం, ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వచ్చిన భాగస్వామ్యాలు భారత జట్టు భారీ స్కోరుకు కారణమయ్యాయి.

యశస్వి జైస్వాల్ (18), రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) తక్కువ స్కోర్లకే ఔటైనా, చివర్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులు చేసి, స్కోరు 349కి చేర్చడంలో తోడ్పడ్డాడు. సౌతాఫ్రికా బౌలర్లు చివరి ఓవర్లలో కోలుకొని భారత జట్టును కట్టడి చేయగలిగారు. సౌతాఫ్రికా తరఫున నాండ్రే బర్గర్, కార్బిన్ బాష్, మార్కో యాన్సెన్, ఓట్నీల్ బార్ట్‌మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేయడంతో, సౌతాఫ్రికా జట్టు విజయానికి 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..