Virat Kohli:: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..

India ODI Captain: భారత వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఈ వారంలో తేలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా పర్యటనకు క్లియరెన్స్ ఇస్తే జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఈ వారం సమావేశమవుతారు...

Virat Kohli:: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..
Virat Kohli
Follow us

|

Updated on: Dec 02, 2021 | 12:09 PM

భారత వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఈ వారంలో తేలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా పర్యటనకు క్లియరెన్స్ ఇస్తే జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఈ వారం సమావేశమవుతారు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కోహ్లీని వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో భారత జట్టు టూర్ కొనసాగుతుందని బీసీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అయినప్పటికీ వారు ఆ దేశంలో కొత్త COVID-19 వేరియంట్ పుట్టుకురావటంతో అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ‘‘భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తాం. మేము మా వైపు నుంచి అన్ని సిద్ధం చేసి, ఆపై ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉంటాం. పర్యటనను నిలిపివేయమని ప్రభుత్వం మాకు చెబితే, మేము చేస్తాం, అయితే మేము జట్టును ఎంపిక చేసి సిద్ధంగా ఉంచాలి” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి బుధవారం చెప్పారు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. భారత్ రాబోయే ఏడు నెలల్లో విదేశాల్లో ఆరు (దక్షిణాఫ్రికా,ఇంగ్లండ్‎తో మూడు చొప్పున) మ్యాచ్‎లు ఆడనుంది. అలాగే తొమ్మిది ODIలు ఉన్నాయి. ప్రస్తుతం బీసీసీఐ రెండు ఆలోచనలు చేస్తుంది. కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నందున కోహ్లీని కెప్టెన్‎గా కొనసాగించడం. భారతదేశంలో జరగనున్న 2023 ODI ప్రపంచ కప్ కోసంశక్తివంతమైన జట్టును సిద్ధం చేయడానికి రోహిత్‌కు తగినంత సమయం ఇవ్వడం. అయితే కోహ్లీ వన్డే కెప్టెన్‌గా ఉంచడంపై బీసీసీఐ అధ్యక్షుడు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. కోహ్లీ కెప్టెన్‎గా ఏ ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేదు. వ్యక్తిగతంగా అతని రికార్డు బాగుంది.

ప్రస్తుతానికి BCCI దక్షిణాఫ్రికాతో పూర్తి సిరీస్ ఆడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే, మూడు టెస్టుల సిరీస్‌ను కుదించడంపై చర్చలు జరుగుతున్నాయి. సౌతాఫ్రికా టార్‎లో భారత్ మూడు టెస్ట్‎లు ఆడనుంది.

Read Also.. CSK: మొయిన్ అలీని ఎందుకు రిటైన్ చేసుకున్నామంటే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎస్‎కే సీఈవో..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు