AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చెమటోడ్చిన టీమిండియా ఆటగాళ్లు.. ఆ లోపాలపై కోహ్లీ, శ్రేయాస్ తీవ్ర కసరత్తులు..

సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సులువుగా భారత జట్టును ఓడించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 1-0తో ముందంజలో ఉంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు జరగనుంది. కేప్‌టౌన్‌ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి.

Video: చెమటోడ్చిన టీమిండియా ఆటగాళ్లు.. ఆ లోపాలపై కోహ్లీ, శ్రేయాస్ తీవ్ర కసరత్తులు..
Team India
Venkata Chari
|

Updated on: Jan 01, 2024 | 9:45 PM

Share

Virat Kohli and Shreyas Iyer: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచి కేప్ టౌన్ వేదికగా రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే, సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో భారత జట్టు కేప్ టౌన్ లో అడుగుపెట్టనుంది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా జట్టు సిరీస్‌ను గెలుచుకోవాలని కోరుకుంటుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో చెమటలు పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ కనిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నాండ్రే బెర్గర్ బంతులను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లీ నెట్స్ సెషన్‌లో ప్రత్యేక పద్ధతిలో ప్రాక్టీస్ చేశాడు. అదే సమయంలో, శ్రేయాస్ అయ్యర్ షార్ట్ బాల్స్‌కు తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. సోమవారం నెట్స్‌లో కోహ్లీ దాదాపు గంటసేపు చెమటోడ్చాడు. దీని తర్వాత, దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు త్రోడౌన్‌కు వ్యతిరేకంగా సాధన చేశారు. అలాగే శ్రేయాస్ అయ్యర్ షార్ట్ బంతులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ సమయంలో, శ్రేయాస్ అయ్యర్ నెట్స్‌లో షార్ట్ బంతులకు వ్యతిరేకంగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.

కేప్ టౌన్ వేదికగా ఇరు జట్ల పోరు..

సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సులువుగా భారత జట్టును ఓడించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 1-0తో ముందంజలో ఉంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు జరగనుంది. కేప్‌టౌన్‌ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..