AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli vs Bairstow: మొన్న బద్ద శత్రువులు.. నేడు మిత్రులైన ఇద్దరు దిగ్గజాలు.. ప్రాక్టీస్ సెషన్‌లో అరుదైన సీన్..

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ సందర్భంగా, భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్‌కు ప్లేయర్ జానీ బెయిర్‌స్టో మధ్య హీట్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ చర్చలో అంపైర్ జోక్యం చేసుకున్నాడు.

Kohli vs Bairstow: మొన్న బద్ద శత్రువులు.. నేడు మిత్రులైన ఇద్దరు దిగ్గజాలు.. ప్రాక్టీస్ సెషన్‌లో అరుదైన సీన్..
Ind Vs Eng 2022 Virat Kohli And Jonny Bairstow
Venkata Chari
|

Updated on: Jul 16, 2022 | 4:07 PM

Share

IND vs ENG 2022: భారత ఆటగాడు విరాట్ కోహ్లీ తన దూకుడు శైలికి ప్రసిద్ధి చెందాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్‌కు ప్లేయర్ జానీ బెయిర్‌స్టో మైదానంలో తలపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగినా.. లార్డ్స్ వన్డేకు ముందు భిన్నమైన దృశ్యం కనిపించింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మైదానంలో చాలా సేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఫీల్డ్‌లో ఉన్న అభిమానులకు ఆ దృశ్యం బాగా నచ్చింది. దీంతో ఈ వీడియోను నెట్టింట్లో పంచుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన చివరి టెస్టులో జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ మైదానంలో కామెంట్ చేశాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో కూడా స్పందించాడు. దీంతో ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా రావడంతో, అంపైర్ జోక్యం చేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జానీ బెయిర్‌స్టో మాట్లాడుతూ, ఇది పెద్ద విషయం కాదని, మైదానంలో పరిస్థితి వేరేలా ఉంటుందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

‘మా మధ్య పరస్పర అవగాహన చాలా బాగుంది’

గత 10 ఏళ్లుగా నేను, విరాట్ కలుస్తూనే ఉన్నామని జానీ బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. మా మధ్య పరస్పర అవగాహన చాలా బాగుంది. అదే సమయంలో, క్రికెట్ మైదానంలో గెలవడానికి బరిలోకి దిగుతామని, కాబట్టి కొన్ని సార్లు విషయాలు కంట్రోల్ చేసుకోవడం కష్టమని, ఇది పెద్ద విషయం కాదని తెలిపాడు. విశేషమేమిటంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం 3 మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంగా నిలిచాయి. దీంతో రేపు జరిగే మ్యాచ్‌పైనే ఇరుజట్లు ఫోకస్ చేసి, సిరీస్ గెలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!