AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసిన కింగ్ కోహ్లీ వీడియో.. నోటీసులు జారీ చేసిన హైకోర్ట్.. ఎందుకంటే?

Virat Kohli's Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో విరాట్ కోహ్లీ దేశంలో పిల్లలకు క్రీడా మైదానాలు లేకపోవడం గురించి మాట్లాడటం చూడొచ్చు. పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కోహ్లీ వీడియోలో స్పష్టంగా చూపించాడు.

Video: కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసిన కింగ్ కోహ్లీ వీడియో.. నోటీసులు జారీ చేసిన హైకోర్ట్.. ఎందుకంటే?
Virat Kohli VideoImage Credit source: Star sports
Venkata Chari
|

Updated on: Sep 19, 2023 | 3:01 PM

Share

Uttarakhand High Court: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఈ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో పిల్లలు ఆడుకునే ప్లేగ్రౌండ్‌ల సమస్యల గురించి కోహ్లీ మాట్లాడాడు. అయితే, వీడియో విడుదలైన తర్వాత, కేసు కోర్టుకు నమోదైంది. ఉత్తరాఖండ్ హైకోర్టు తన స్వంత చొరవతో విచారణ చేపట్టింది. అలాగే, ఈ వీడియోపై స్పందించాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

విరాట్ కోహ్లీ వీడియోలో ఏముందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో దేశంలో పిల్లలకు క్రీడా మైదానాలు లేకపోవడంపై విరాట్ కోహ్లీ మాట్లాడటం చూడొచ్చు. పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కోహ్లీ వీడియోలో స్పష్టంగా చూపించాడు. ఇప్పుడు కోహ్లి వీడియోకు సంబంధించి రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రాకేష్ తప్లియాల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తరాఖండ్ క్రీడా కార్యదర్శి, భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, యువజన వ్యవహారాలు, క్రీడా కార్యదర్శి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. పిల్లలకు ఆటస్థలాలను సిద్ధం చేసేందుకు ఎలాంటి విధానాలు అమలుచేశారని కోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఇప్పుడు ఈ కేసును అక్టోబర్ 9న కోర్టు విచారించనుంది.

ఇవి కూడా చదవండి

కోహ్లీ వీడియోపై కోర్టు ఏం చెప్పిందంటే?

విరాట్ కోహ్లీ వీడియోపై హైకోర్టు స్పందిస్తూ.. చాలా చోట్ల పిల్లలకు ఆట స్థలం దొరకడం లేదు. ఇంతకుముందు కొందరు పిల్లలు మనం రోడ్డుపై క్రికెట్ ఆడుతుంటే.. అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. పిల్లలు శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడు, వారి మానసిక అభివృద్ధి వేగంగా ఉంటుంది. అదే సమయంలో ఫిట్‌నెస్‌ను కాపాడుకునే సౌకర్యాలు లేనప్పుడు పిల్లలు కంప్యూటర్‌లు, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో కాలం గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి శారీరక, మానసిక ఎదుగుదల కుంటుపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.

ఈ విషయమై కోర్టు మాట్లాడుతూ.. పిల్లల అభివృద్ధికి ఆటస్థలాలు అవసరమన్నారు. అలాగే క్రీడా మైదానాలకు సంబంధించిన విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలని కోరారు. పిల్లలకు ఆట స్థలాలు అందించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కింద అమలు చేస్తున్న పథకాలపై కూడా కోర్టు ప్రశ్నలు సంధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..