ICC World Cup 2023: అక్టోబర్ 29న భారత్, ఇంగ్లాండ్ పోరు.. హాజరుకానున్న ఇరుదేశాల ప్రధాన మంత్రులు..
India vs England, ICC World Cup 2023: ప్రపంచకప్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత్.. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. పాకిస్థాన్తో తలపడేందుకు ఇప్పుడు అహ్మదాబాద్కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య పోరు ముగిసిన తర్వాత అక్టోబర్ 19న బంగ్లాదేశ్తో రోహిత్ సేన నాలుగో మ్యాచ్ ఆడనున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 22న పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.

India Vs England ICC World Cup 2023 29th Match: అక్టోబర్ 29న లక్నోలోని ఎకానా స్టేడియంలో భారతదేశం వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్ను చూడటానికి బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ మైదానానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అక్టోబర్ చివరిలో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. కాగా, సునక్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్ను వీక్షిస్తారని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. అయితే, ఈ విషయమై ఇరు దేశాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ద్వైపాక్షిక చర్చలు..
సునాక్ పర్యటన సందర్భంగా భారతదేశం, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేసే అవకాశం ఉంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు సునక్ గత నెలలో భారత్కు వచ్చారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సునక్లు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా, ద్వైపాక్షిక చర్చలకు ప్రధాని మోదీ భారత్ను ఆహ్వానించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో ఈ ద్వైపాక్షిక సంభాషణకు తేదీని నిర్ణయించనున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 28న భారతదేశానికి చేరుకుంటున్నారా?
అన్నీ అనుకున్నట్లు జరిగితే బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ అక్టోబర్ 28న భారత్లో పర్యటిస్తారని, ఒకరోజు తర్వాత అంటే అక్టోబర్ 29న భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే 29వ మ్యాచ్ను వీక్షిస్తారని సమాచారం.
29న భారత్-ఇంగ్లండ్ మధ్య పోరు..
View this post on Instagram
ప్రపంచకప్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత్.. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. పాకిస్థాన్తో తలపడేందుకు ఇప్పుడు అహ్మదాబాద్కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య పోరు ముగిసిన తర్వాత అక్టోబర్ 19న బంగ్లాదేశ్తో రోహిత్ సేన నాలుగో మ్యాచ్ ఆడనున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 22న పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో తలపడనున్న భారత్.. అక్టోబర్ 29న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో తన 6వ మ్యాచ్లో తలపడనుంది.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




