IND vs PAK: మరోసారి కష్టాల్లో పాకిస్తాన్.. ఛాంపియన్స్ ట్రోఫీ వాయిదా పడే ఛాన్స్.. ఎందుకంటే?

|

Dec 25, 2023 | 3:36 PM

Champions Trophy 2025: దీని ప్రకారం, ఆసియా కప్ పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించారు. ఇక్కడ భారత జట్టు శ్రీలంకలో ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు రావడానికి టీమ్ ఇండియా సంకోచిస్తే, టోర్నీని మార్చవచ్చు. యూఏఈలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని తెలుస్తోంది.

IND vs PAK: మరోసారి కష్టాల్లో పాకిస్తాన్.. ఛాంపియన్స్ ట్రోఫీ వాయిదా పడే ఛాన్స్.. ఎందుకంటే?
Ind Vs Pak Ct 2025
Follow us on

India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) టోర్నమెంట్ జరుగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే హక్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఇప్పటికే కట్టబెట్టింది. దీని ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. కానీ, పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే భారత్ పాల్గొనడం అనుమానమే. దీంతో టోర్నీని యూఏఈకి మార్చే విషయమై చర్చలు మొదలయ్యాయి.

టోర్నీని తరలించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించకపోతే, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. అంటే, టీమ్ ఇండియా మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చే అవకాశం బలంగా వినిపిస్తోంది.

ఎందుకంటే ఈసారి ఆసియా కప్ నిర్వహించే హక్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఉంది. కానీ, భారత జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు వెనుకాడడంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించారు.

దీని ప్రకారం, ఆసియా కప్ పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించారు. ఇక్కడ భారత జట్టు శ్రీలంకలో ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు రావడానికి టీమ్ ఇండియా సంకోచిస్తే, టోర్నీని మార్చవచ్చు. యూఏఈలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని తెలుస్తోంది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కా అష్రఫ్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అల్ జరూనీ దీనిపై చర్చించారు. అదే సమయంలో, భారత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను యూఏఈకి మార్చాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అందుకే భారత్‌ మ్యాచ్‌లు యూఏఈకి మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ప్రస్తుతం దీనిపై మౌనం వహిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐ తదుపరి ఎత్తుగడ ఎలా ఉంటుందో వేచి చూడాలని నిర్ణయించుకుంది. టోర్నీ ప్రారంభానికి ఇంకా ఏడాది సమయం ఉన్నందున భారత క్రికెట్ బోర్డు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు.

ఎందుకంటే, ICC టోర్నీలను తరలించాలంటే, నిర్దిష్ట కారణాలు ఉండాలి. టోర్నీని ఇక్కడికి తరలించేందుకు బీసీసీఐ భద్రతా కారణాలను వెల్లడించినప్పటికీ, ఇతర క్రికెట్ బోర్డులు కూడా చేతులు కలపాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాయి. అయితే 2025లో బీసీసీఐ ఎలాంటి కారణాలను ముందుకు తెస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన 8 జట్లు:

భారతదేశం

దక్షిణ ఆఫ్రికా

ఆస్ట్రేలియా

న్యూజిలాండ్

పాకిస్తాన్ (ఆతిథ్య దేశం)

ఆఫ్ఘనిస్తాన్

ఇంగ్లండ్

బంగ్లాదేశ్.

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..