ICC: తూచ్! ఇదంతా దొంగాట.. టీమిండియాకు అవమానం.. మళ్లీ టెస్టుల్లో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం..

వన్డే, టీ20, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ తగ్గేదేలే అన్నట్లుగా ర్యాంకింగ్‌లో టీమిండియా అగ్రస్థానంలోకి చేరుకుంది.

ICC: తూచ్! ఇదంతా దొంగాట.. టీమిండియాకు అవమానం.. మళ్లీ టెస్టుల్లో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం..
Team India
Follow us

|

Updated on: Feb 15, 2023 | 9:48 PM

వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ తగ్గేదేలే అన్నట్లుగా ర్యాంకింగ్‌లో టీమిండియా అగ్రస్థానంలోకి చేరుకుంది. భారత ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే కొద్ది గంటల్లోనే ఆనందం మొత్తం ఆవిరైంది. తూచ్! ఇదంతా దొంగాట అంటూ ఐసీసీ.. టీమిండియాను అవమానించింది. సీన్ కట్ చేస్తే.. మళ్లీ ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది.

బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ ఆధారంగా టెస్టుల్లో టీమిండియా 115 పాయింట్స్‌తో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా 111 పాయింట్స్‌తో ఉన్నాయి. అయితే అదే రోజు ఈవెనింగ్‌కు లెక్కలు మొత్తం మారిపోయాయి. మళ్లీ ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ కన్‌ఫ్యూజన్ మొత్తం టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందని ఐసీసీ పేర్కొంది.

అటు ప్లేయర్స్ విషయానికొస్తే.. వన్డే ఫార్మాట్‌లో మొహమ్మద్ సిరాజ్ ఐసీసీ నెం.1 బౌలర్‌గా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా.. పొట్టి క్రికెట్‌లో నెం.1 బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్.. టెస్టుల్లో నెంబర్ 2 బౌలర్‌గా, నెంబర్ 2 ఆల్‌రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. కాగా, ప్రస్తుతం పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 126 పాయింట్స్‌తో అగ్రస్థానంలో, భారత్ 11 పాయింట్స్ తక్కువ అంటే.. 115 పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ర్యాంకింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..