AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. తొలి భారతీయ బౌలర్‌గా రికార్డ్..

దక్షిణాఫ్రికాపై అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.

IND vs SA: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. తొలి భారతీయ బౌలర్‌గా రికార్డ్..
Arshdeep Singh
Venkata Chari
|

Updated on: Sep 30, 2022 | 5:59 AM

Share

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చాలా సందర్భాలలో మంచి ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికాపై ప్రమాదకరంగా బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మూడు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్‌ ఈ ప్రదర్శనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను రెండో ఓవర్ రెండో బంతికి క్వింటన్ డి కాక్‌ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో రోసును అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. ఐదో బంతికి అవుటయ్యాడు. రెండో ఓవర్ చివరి బంతికి మిల్లర్‌ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. ఈ విధంగా పవర్‌ప్లేలో అర్ష్‌దీప్ మూడు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాపై టీ20 ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌‌గా నిలిచాడు.

తిరువనంతపురం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 107 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ముందజంలో నిలిచింది. కేఎల్ రాహుల్ 51(56 బంతులు, 2 ఫోర్లు, 4 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ 50(33 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్‌ 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుండడం గమనార్హం. ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2న రెండో టీ20 మ్యాచ్‌కి భారత జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్ గౌహతిలో జరగనుంది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్‌ అక్టోబర్‌ 4న ఇండోర్‌లో జరగనుంది.

భారత్ vs దక్షిణాఫ్రికా:

1వ టీ 20 – 28 సెప్టెంబర్ (తిరువనంతపురం) – ఫలితం: 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం.

2వ టీ20 – 2వ తేదీ అక్టోబర్ (గౌహతి) 3వ టీ

3వ టీ20 – 4వ తేదీ అక్టోబర్ (ఇండోర్)

1వ వన్డే – అక్టోబర్ 6 (లక్నో)

2వ వన్డే – అక్టోబర్ 9 (రాంచీ) అక్టోబర్

3వ వన్డే – 11వ తేదీ (ఢిల్లీ)

దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టు-

రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), రవి అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమేష్ యాదవ్ హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

భారత్‌తో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు..

టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జన్మాన్ మలన్, ఐదాన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, తబ్సోరిజ్ రైస్‌బాసి.