T20 WC 2024 Prize Money: ఛాంపియన్ జట్టుపై కోట్ల వర్షం.. సెమీస్, లీగ్ దశలో ఓడిన జట్ల ఖాతాలో ఎంత చేరనున్నాయంటే?
T20 World Cup Prize Money Details: టీ20 ప్రపంచ కప్ 2024 కారవాన్ ఫైనల్కు చేరుకుంది. ప్రస్తుత ఎడిషన్ చివరి మ్యాచ్ జూన్ 29న బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. సూపర్ 8 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. మొదటి సెమీ-ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏకపక్షంగా ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది. రెండవ సెమీ-ఫైనల్లో, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను టీమిండియా ఇలాగే ఓడించి ఫైనల్కు చేరుకుంది.
![T20 WC 2024 Prize Money: ఛాంపియన్ జట్టుపై కోట్ల వర్షం.. సెమీస్, లీగ్ దశలో ఓడిన జట్ల ఖాతాలో ఎంత చేరనున్నాయంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/t20-wc-2024-prize-money.jpg?w=1280)
T20 World Cup Prize Money Details: టీ20 ప్రపంచ కప్ 2024 కారవాన్ ఫైనల్కు చేరుకుంది. ప్రస్తుత ఎడిషన్ చివరి మ్యాచ్ జూన్ 29న బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. సూపర్ 8 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. మొదటి సెమీ-ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏకపక్షంగా ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది. రెండవ సెమీ-ఫైనల్లో, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను టీమిండియా ఇలాగే ఓడించి ఫైనల్కు చేరుకుంది.
ఈసారి టీ20 ప్రపంచకప్ విజేతపై భారీ మొత్తంలో కాసుల వర్షం..
ఈసారి టీ20 ప్రపంచకప్ విజేతపై భారీ మొత్తంలో కాసుల వర్షం కురిపించనున్నారు. అదే సమయంలో టైటిల్ మ్యాచ్కు ముందే నిష్క్రమించిన అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ జట్లకు కూడా కోటి రూపాయలు దక్కనున్నాయి. ప్రస్తుత టోర్నీలో ప్రైజ్ మనీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
ఐపీఎల్ 2024 విజేత కంటే ఫైనల్ ట్రోఫీ గెలిచిన జట్టుకే ఎక్కువ డబ్బు..
ICC reveal historic prize money for the Men’s #T20WorldCup 🤩
Details ⬇️https://t.co/jRhdAaIkmc
— ICC (@ICC) June 3, 2024
టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ మొత్తం 11.25 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 93.50 కోట్లు) ప్రకటించింది. అందులో టైటిల్ విన్నింగ్ జట్టు US $ 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 20.3 కోట్లు అందుకుంటుంది. IPL విజేత జట్టుకు ఇది అందిన మొత్తం కంటే ఎక్కువ. తాజాగా ఐపీఎల్ 2024 విజేత కోల్కతా నైట్ రైడర్స్ రూ.20 కోట్లు అందుకుంది.
టోర్నమెంట్ తొమ్మిదో ఎడిషన్లో విజేతగా నిలిచిన రన్నరప్ జట్టుకు US$1.28 మిలియన్ (రూ.10.6 కోట్లు) లభిస్తుంది.
సెమీఫైనల్లోనే ప్రయాణాన్ని ముగించిన ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్లు కూడా ధనవంతులు కానున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్లైన ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ల ప్రయాణం సెమీ-ఫైనల్కు మించి ముందుకు సాగలేదు. అయితే, ఈ రెండు జట్లూ ఔట్ అయినప్పటికీ భారీ మొత్తాన్ని అందుకోనున్నాయి. సెమీ-ఫైనల్కు చేరిన ప్రతి జట్టుకు US $ 787,500 ఇవ్వాలని ఐసీసీ ప్రకటించింది. ఈ కారణంగా ఇంగ్లండ్కు రూ.6.5 కోట్లు రానుంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్కు కూడా అదే మొత్తంలో డబ్బు లభిస్తుంది.
సూపర్ 8, 9 నుంచి 20 స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా కోటి రూపాయలు అందుతాయి..
సూపర్ 8కి చేరుకునే జట్లకు ICC US $ 382,500 మొత్తాన్ని ప్రకటించింది. ఈ కారణంగా, ఆ దశలో ఏ జట్టు తన ప్రయాణాన్ని ముగించినా రూ.3.17 కోట్లు అందుకుంటుందన్నమాట. అదే సమయంలో, 9 నుంచి 12వ ర్యాంక్లో ఉన్న జట్లకు US $ 247,500 (రూ. 2.05 కోట్లు) ఇవ్వనున్నారు. అయితే, 13 నుంచి 20వ ర్యాంక్లో ఉన్న ప్రతి జట్టు US $ 225,000 (రూ. 1.87 కోట్లు) అందుకుంటుంది.
ఇది కాకుండా, గ్రూప్ స్టేజ్, సూపర్ 8లో ప్రతి మ్యాచ్ గెలిచిన జట్టుకు అదనంగా US $ 31,154 (రూ. 25.89 లక్షలు) ఇవ్వాలని ఐసీసీ ప్రకటించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..