IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీస్.. ఇరు జట్ల గత రికార్డులు, పిచ్ రిపోర్టులు ఎలా ఉన్నాయంటే?

IND vs ENG, T20 world cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024 చాంపియన్‌గా నిలవాలంటే భారత్‌ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవాలి. తొలి మ్యాచ్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవాల్సి ఉంది. దీని తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ లేదా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది.

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీస్.. ఇరు జట్ల గత రికార్డులు, పిచ్ రిపోర్టులు ఎలా ఉన్నాయంటే?
IND Vs ENG
Follow us

|

Updated on: Jun 26, 2024 | 10:28 PM

IND vs ENG, T20 world cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024 చాంపియన్‌గా నిలవాలంటే భారత్‌ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవాలి. తొలి మ్యాచ్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవాల్సి ఉంది. దీని తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ లేదా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధిస్తే 11 ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఐసీసీ కప్ సొంతమవుతుంది. T20 వరల్డ్ కప్ 2024 సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య గురువారం (జూన్ 27) రాత్రి 8 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ముఖాముఖి రికార్డులు, పిచ్ రిపోర్టు తదితర వివరాలు తెలుసుకుందాం రండి.

గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలోని పిచ్‌పై ఇప్పటి వరకు స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం. ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇప్పటి వరకు 34 టీ20 మ్యాచ్‌లు జరగ్గా అందులో 16 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా, 14 సార్లు లక్ష్యాన్ని చేధించిన జట్టు విజయం సాధించింది. అదే సమయంలో, ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 127 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు కేవలం 95 పరుగులు మాత్రమే.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్‌లు మొత్తం 4 సార్లు తలపడ్డాయి. భారత్‌ రెండుసార్లు గెలుపొందగా, ఇంగ్లండ్‌ రెండుసార్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ 2007 ప్రపంచకప్‌లో జరిగింది. భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత 2009 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. అదే సమయంలో 2012 ప్రపంచకప్‌లో భారత్ 90 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీని తరువాత, 2022 ప్రపంచ కప్‌లో రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇందులో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే, ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 12 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. గత 5 టీ20 మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే, భారత్ 3 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లాండ్ 2 మ్యాచ్‌లు గెలిచింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే రెండు జట్లూ పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది..

భారత్-ఇంగ్లండ్ రికార్డు ఎలా ఉందంటే? గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో టీమ్ ఇండియా ఇప్పటివరకు 3 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడింది. ఇందులో టీం ఇండియా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 1 మ్యాచ్‌లో ఓడిపోయింది. మరోవైపు, ఇంగ్లండ్ ఇక్కడ 2 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది, అందులో ఒకటి డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం ఓడిపోగా, మరొకటి వర్షం కారణంగా రద్దయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles