IND vs ENG: ఆడాల్సింది జట్టు కోసం, నీ కోసం కాదు.. భారత స్టార్ బ్యాటర్‌పై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar Key Comments on KL Rahul: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. 9 బంతుల్లో అతని బ్యాట్ నుంచి కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అతని ఇన్నింగ్స్ తర్వాత, మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ఈ సీనియర్ ప్లేయర్‌పై విమర్శలు గుప్పించారు.

IND vs ENG: ఆడాల్సింది జట్టు కోసం, నీ కోసం కాదు.. భారత స్టార్ బ్యాటర్‌పై గవాస్కర్ ఫైర్
Kl Rahul

Updated on: Feb 07, 2025 | 6:55 PM

KL Rahul Poor Performance ODI Series: కేఎల్ రాహుల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటి నుంచి ఈ ఆటగాడిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా రాహుల్ పై ఇలాంటి ప్రశ్ననే లేవనెత్తారు. క్రికెట్ అనేది జట్టు ఆట అని, ఇక్కడ మీరు మీ కోసం ఆడాల్సిన అవసరం లేదంటూ గవాస్కర్ కేఎల్ రాహుల్‌కు సలహా ఇచ్చాడు. గవాస్కర్ ప్రకటనను బట్టి చూస్తే, కేఎల్ రాహుల్ జట్టు కోసం కాకుండా తన కోసమే బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. గవాస్కర్ ఏమన్నారో ఓసారి చూద్దాం..

రాహుల్‌పై ప్రశ్నల వర్షం సంధించిన గవాస్కర్..

రాహుల్ వచ్చిన వెంటనే డిఫెన్సివ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడని గవాస్కర్ కామెంట్రీ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ‘నువ్వు మరీ రక్షణాత్మకంగా ఉండాల్సిన అవసరం లేదు.’ ఇది జట్టు ఆట. నువ్వు అనవసరంగా షాట్ ఆడి అవుట్ అయ్యావు’ అంటూ చెప్పుకొచ్చాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత రాహుల్ చాలా సమయం తీసుకుంటున్నట్లు కనిపించింది. కానీ, 9వ బంతికి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. రాహుల్ గిల్ తన సెంచరీ పూర్తి చేయాలని కోరుకున్నట్లు అనిపించింది. కానీ, ముందే రాహుల్ ఔటయ్యాడు. తరువాత గిల్ కూడా సెంచరీ సాధించలేకపోయాడు. 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతని వికెట్ కోల్పోయింది.

కేఎల్ రాహుల్ స్థానంపైనా ప్రశ్నలు..

నాగ్‌పూర్ వన్డేలో కేఎల్ రాహుల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, జట్టులో ప్రధాన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్. కానీ, కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా ఆడించారంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. అతను విఫలమయ్యాడు. రాహుల్ వైఫల్యం టీం ఇండియాపై పెద్దగా ప్రభావం చూపలేదు. భారత జట్టు ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. తదుపరి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us