AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది.. బీసీసీఐ ప్లాన్ వెనుక సీక్రెట్ ఇదే

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో టి20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా వంటి సీనియర్లు తిరిగి రావడంతో గత సిరీస్ ఆడిన 8 మంది యంగ్ ప్లేయర్లకు చోటు దక్కలేదు. సీనియర్లు రావడంతో యువ ఆటగాళ్లు అవకాశాలను కోల్పోయినప్పటికీ, ఇది భారత్ జట్టును మరింత బలోపేతం చేసే చర్యగా కనిపిస్తోంది.

IND vs AFG: పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది.. బీసీసీఐ ప్లాన్ వెనుక సీక్రెట్ ఇదే
Ind Vs Afg
Rakesh
|

Updated on: Sep 01, 2026 | 7:18 PM

Share

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడు టి20ల సిరీస్‌ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత జింబాబ్వే పర్యటనలో ఆడిన 8 మంది ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవం వల్ల పాకిస్థాన్ జట్టు ఏకంగా 7 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. కానీ టీమిండియాలో జరిగిన ఈ 8 మార్పుల వెనుక కారణం ఏమాత్రం శిక్ష కాదని తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌ కోసం సీనియర్ ప్లేయర్లు తిరిగి రావడంతో, గత సిరీస్‌లో ఆడిన చాలామంది కుర్రాళ్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

పక్కన పెట్టిన ఆటగాళ్లు వీరే

జింబాబ్వే సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న యంగ్ పేసర్లు మయూంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మలు ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరితో పాటు ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే కూడా తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు ఫినిషర్ బాధ్యతలు నిర్వర్తించే రింకూ సింగ్‌ను కూడా ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం గమనార్హం.

తిరిగి జట్టులోకి వచ్చిన సీనియర్లు

అఫ్గానిస్థాన్ జట్టుపై పూర్తి ఆధిక్యత సాధించాలనే లక్ష్యంతో భారత సెలెక్టర్లు సీనియర్లతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేశారు. వేగవంతమైన బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు తిరిగొచ్చారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిల పునరాగమనంతో జట్టు కలయిక పూర్తిగా మారిపోయింది.

అఫ్గానిస్థాన్ టి20 సిరీస్‌ కోసం భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), ఈశాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us