AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో ఏడుగురు మృతి!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వాళ్ల హోం గ్రౌండ్‌ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజ సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు.

తీవ్ర విషాదం.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో ఏడుగురు మృతి!
Rcb Fans
SN Pasha
|

Updated on: Jun 04, 2025 | 6:12 PM

Share

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని టీవీ9 కన్నడ రిపోర్ట్ చేసింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వాళ్ల హోం గ్రౌండ్‌ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజ సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు. ఆర్సీబీ టీమ్‌ మొత్తం ఈ రోజు మధ్యాహ్నాం బెంగళూరుకు చేరకుంది. తమ అభిమాన ఆటగాళ్లు, టీమ్‌ ట్రోఫీతో వస్తుంటే చూసి.. వారి అభినందించేందుకు స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 17 సీజన్లుగా కప్పు గెలవలేకపోయిన ఆర్సీబీ.. ఫైనల్‌గా 18వ సీజన్లో తమ తొలి ఐపీఎల్‌ ట్రోఫీ సాధించడంతో ఈ రోజు బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు. ముందు విధాన సౌధకు చేరుకొని.. అక్కడ సీఎంను కలిసి అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలి అనుకున్నారు. కానీ, పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో విధాన సౌధ నుంచి నేరుగా ఆటగాళ్లు స్టేడియానికి చేరుకోనున్నారు. అయితే ఆటగాళ్లు విధాన సౌధాకు వస్తున్నారనే విషయం తెలిసిందే. అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

View this post on Instagram

A post shared by NEWS9 (@news9live)

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం