AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనీ ఆటతీరుపై గంగూలీ గరంగరం!

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి దిశగా టీమిండియా ఆటతీరు సాగుతున్న సందర్భంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తాను పూర్తిగా తికమకకు గురయ్యానని, ఏం జరుగుతుందో తెలియడం లేదని నాజర్ వ్యాఖ్యానించాడు. టీమిండియాకు కావాల్సింది ఇది కాదని, వాళ్లకు మరిన్ని రన్స్ అవసరమని చెప్పాడు. అలాంటి సందర్భంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్స్ ఏం […]

ధోనీ ఆటతీరుపై గంగూలీ గరంగరం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 7:13 PM

Share

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి దిశగా టీమిండియా ఆటతీరు సాగుతున్న సందర్భంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తాను పూర్తిగా తికమకకు గురయ్యానని, ఏం జరుగుతుందో తెలియడం లేదని నాజర్ వ్యాఖ్యానించాడు. టీమిండియాకు కావాల్సింది ఇది కాదని, వాళ్లకు మరిన్ని రన్స్ అవసరమని చెప్పాడు. అలాంటి సందర్భంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పటికే వెళ్లిపోతున్నారని, ధోనీ నుంచి వాళ్లు ఈ ఆటతీరును ఆశించలేదని తెలిపాడు.

గంగూలీ స్పందిస్తూ.. ఈ ఆటతీరు గురించి చెప్పడానికి తన దగ్గర ఎలాంటి వివరణ లేదన్నాడు… ఈ సింగిల్స్ గురించి తన దగ్గర సమాధానం లేదన్నాడు. ఐదు వికెట్లు చేతిలో ఉండగా 338 పరుగులు చేయలేని స్థితిలో భారత బ్యాట్స్‌మెన్స్ ఉన్నారని గంగూలీ దుయ్యబట్టాడు. ధోనీ సింగిల్స్ తీస్తూ స్లోగా బ్యాటింగ్ చేయడంపై సౌరవ్ పరోక్ష విమర్శలు చేశాడు.