AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : మ్యాచ్ గెలిచిన వెంటనే.. గుర్తు పట్టి మరీ పాత స్నేహితుడిని గట్టిగా హత్తుకున్న శుభ్‌మన్ గిల్!

క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఎన్నో ఎమోషన్స్​కు వేదిక. భారత్-యూఏఈ మధ్య జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్​లో ఇలాంటి ఒక భావోద్వేగమైన క్షణం కనిపించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, యూఏఈ ప్లేయర్ సిమ్రన్‌జీత్ సింగ్‌ను హత్తుకుని అందరి మనసు గెలుచుకున్నాడు.

Shubman Gill : మ్యాచ్ గెలిచిన వెంటనే.. గుర్తు పట్టి మరీ పాత స్నేహితుడిని గట్టిగా హత్తుకున్న శుభ్‌మన్ గిల్!
Shubman Gill Simranjeet Singh
Rakesh
|

Updated on: Sep 11, 2025 | 10:33 AM

Share

Shubman Gill : క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఎన్నో ఎమోషన్స్​కు వేదిక. భారత్-యూఏఈ మధ్య జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్​లో ఇలాంటి ఒక భావోద్వేగమైన క్షణం కనిపించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, యూఏఈ ప్లేయర్ సిమ్రన్‌జీత్ సింగ్‌ను హత్తుకుని అందరి మనసు గెలుచుకున్నాడు.

సిమ్రన్‌జీత్ సింగ్‌కు శుభ్‌మన్ గిల్ గుర్తుంటాడా?

కొద్ది రోజుల క్రితం సిమ్రన్‌జీత్ సింగ్‌కు తాను శుభ్‌మన్ గిల్​కు గుర్తుంటానా లేదా అనే సందేహం ఉండేది. ఎందుకంటే, సిమ్రన్‌జీత్ మోహాలీలో గిల్‌కు బౌలింగ్ చేసినప్పుడు అతడి వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. కానీ, శుభ్‌మన్ గిల్ కేవలం మూడు బంతుల్లోనే అతడి సందేహాలను పటాపంచలు చేశాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో, సిమ్రన్‌జీత్ సింగ్ తన మొదటి ఓవర్‌లో వేసిన మూడో బంతికి గిల్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఆ తర్వాత గిల్ వెంటనే సిమ్రన్‌జీత్ వద్దకు వెళ్లి చేయి కలిపి, గట్టిగా హత్తుకున్నాడు. సిమ్రన్‌జీత్ కూడా చిరునవ్వుతో అతడిని పలకరించాడు.

వారిద్దరి బంధం చాలా పాతది. సిమ్రన్‌జీత్ పంజాబ్‌కు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన యువకుడు శుభ్‌మన్ గిల్ కోసం బౌలింగ్ చేయడానికి సమయం కేటాయించేవాడు. అయితే, వారిద్దరి జీవితాలు ఆ తర్వాత వేర్వేరు మార్గాల్లో వెళ్ళాయి. గిల్ పంజాబ్‌లో ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడి, ఆ తర్వాత త్వరగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2018లో భారత్ తరపున అండర్-19 ప్రపంచకప్ గెలిచాడు. సిమ్రన్‌జీత్ మాత్రం పంజాబ్‌కు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడలేకపోయాడు.

సిమ్రన్‌జీత్ యూఏఈకి ఎందుకు వెళ్లాడు?

2021లో సిమ్రన్‌జీత్ సింగ్ దుబాయ్‌లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చాడు. అప్పుడు భారతదేశంలో కరోనా రెండవ వేవ్ కారణంగా లాక్‌డౌన్ విధించారు. అందుకే అతడు తిరిగి వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత చాలా నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. యూఏఈ తరపున ఆడాలంటే, సిమ్రన్‌జీత్ మూడు సీజన్ల పాటు దేశీయ క్రికెట్ ఆడాలి. ఈ నిబంధనలు పూర్తయిన తర్వాత, అతను కోచ్‌ లాల్‌చంద్ రాజ్‌పుత్‌ను సంప్రదించి, ట్రయల్స్ ఇవ్వమని కోరాడు. “2021 నుంచి నేను దుబాయ్‌లో స్థిరపడిన తర్వాత, జూనియర్ ప్లేయర్లకు కోచింగ్ ఇస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్‌తో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా లభించింది” అని సిమ్రన్‌జీత్ చెప్పాడు. సుమారు పదేళ్ళ తర్వాత, ఈ బుధవారం వారిద్దరూ ఆసియా కప్ మ్యాచ్‌లో కలిశారు. కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అద్భుతమైన బౌలింగ్ వల్ల ఈ మ్యాచ్ త్వరగా ముగిసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us