AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన చేతితో సచిన్ సహచరుడు బ్యాటింగ్.. కట్‌చేస్తే.. 15 ఏళ్ల తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లిటిల్ మాస్టర్

Sachin Tendulkar - Gursharan Singh: గురుశరణ్ సహకారంతో సచిన్ ఆ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఆ ప్రదర్శన వల్లే సచిన్ భారత జట్టుకు ఎంపికయ్యారు. ఈ సంఘటన సచిన్ మనసులో చెరగని ముద్ర వేసింది. గురుశరణ్ త్యాగానికి, అంకితభావానికి సచిన్ అప్పుడే కృతజ్ఞతలు తెలిపారు.

విరిగిన చేతితో సచిన్ సహచరుడు బ్యాటింగ్.. కట్‌చేస్తే.. 15 ఏళ్ల తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లిటిల్ మాస్టర్
Sachin
Venkata Chari
|

Updated on: Dec 10, 2025 | 8:57 PM

Share

Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం తన ఆటతోనే కాకుండా, తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్, మైదానం బయట కూడా తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో సచిన్, తన సహచరుడు గురుశరణ్ సింగ్‌కు ఇచ్చిన మాటను 15 ఏళ్ల తర్వాత ఎలా నిలబెట్టుకున్నారో పంచుకున్నారు.

ఆ సంఘటన వెనుక కథ:

సచిన్ భారత జట్టుకు ఎంపిక కావడానికి ముందు జరిగిన ఇరానీ కప్‌లో ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ తరపున ఆడుతున్నారు. ఆ మ్యాచ్ సచిన్‌కు భారత జట్టు ఎంపికకు ఒక ట్రయల్ లాంటిది. ఆ సమయంలో సచిన్ 85 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, జట్టు 9 వికెట్లు కోల్పోయింది. అప్పుడు జట్టు వైస్ కెప్టెన్ గురుశరణ్ సింగ్ చేతికి గాయమైంది. అయినప్పటికీ, రాజ్ సింగ్ దంగార్‌పూర్ కోరిక మేరకు, విరిగిన చేతితోనే గురుశరణ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చారు.

గురుశరణ్ సహకారంతో సచిన్ ఆ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఆ ప్రదర్శన వల్లే సచిన్ భారత జట్టుకు ఎంపికయ్యారు. ఈ సంఘటన సచిన్ మనసులో చెరగని ముద్ర వేసింది. గురుశరణ్ త్యాగానికి, అంకితభావానికి సచిన్ అప్పుడే కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Tilak Varma: కటక్ టీ20లో తెలుగబ్బాయ్ చారిత్రాత్మక రికార్డ్.. ఆ లిస్ట్‌లో తొలి భారతీయుడిగా..

సచిన్ ఇచ్చిన మాట:

ఆ తర్వాత 1990లో న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నప్పుడు, సచిన్ గురుశరణ్‌తో ఒక మాట చెప్పారు. “గుషీ (గురుశరణ్), నువ్వు ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవుతావు. ఆ రోజు నీ కోసం బెనిఫిట్ మ్యాచ్ (సహాయార్థ మ్యాచ్) నిర్వహిస్తే, నేను తప్పకుండా వచ్చి ఆడుతాను” అని సచిన్ వాగ్దానం చేశారు.

ఇది కూడా చదవండి: ఎవర్రా సామీ నువ్వు.. 23 ఫోర్లు, 18 సిక్సర్లు.. 56 బంతుల్లో 219 పరుగులు.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

15 ఏళ్ల తర్వాత..:

15 ఏళ్ల తర్వాత గురుశరణ్ సింగ్ తన బెనిఫిట్ మ్యాచ్ నిర్వహించినప్పుడు, సచిన్‌కు ఫోన్ చేశారు. అప్పుడు సచిన్, “నేను నీకు న్యూజిలాండ్‌లో ఇచ్చిన మాట నాకు గుర్తుంది. తప్పకుండా వచ్చి ఆడుతాను” అని చెప్పి, ఆ మ్యాచ్‌లో పాల్గొని తన మాట నిలబెట్టుకున్నారు.

“నాకు ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పగలను” అని సచిన్ ఎమోషనల్‌గా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ సంఘటన సచిన్ గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది.