- Telugu News Sports News Cricket news Royal Challengers Bengaluru still be knocked out of IPL 2025 Playoffs
IPL 2025: ఇదెక్కడి ట్విస్ట్ మావ.. అదే జరిగితే, ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔట్..?
IPL 2025 Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో 55 మ్యాచ్లు పూర్తయినప్పటికీ, ఏ జట్టు ప్లేఆఫ్లోకి ప్రవేశించలేక పోవడం గమనార్హం. మూడు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా, ప్లేఆఫ్ రేసు 7 జట్ల మధ్య కొనసాగుతోంది. అందువల్ల, ఈ వారం జరిగే మ్యాచ్ ప్లేఆఫ్స్లో ఆడబోయే జట్ల గురించి స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది.
Updated on: May 06, 2025 | 9:57 AM

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18లో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం 16 పాయింట్లు సాధించినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అధికారికంగా ప్లేఆఫ్లోకి ప్రవేశించలేదు.

దీనికి ప్రధాన కారణం మరో 7 జట్లు ప్లేఆఫ్ రేసులో ఉండటమే. ముఖ్యంగా, 4 జట్లు RCBని అధిగమించి ప్లేఆఫ్స్కు చేరుకునే మంచి అవకాశం ఉంది. అందుకే, రాబోయే మూడు మ్యాచ్లు ఆర్సీబీకి కీలకం. ఎందుకంటే..

ముంబై ఇండియన్స్ తమ తదుపరి మూడు మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడిస్తే, ఆ జట్టు మొత్తం 20 పాయింట్లతో ప్లేఆఫ్కు చేరుకుంటారు.

పంజాబ్ కింగ్స్ తమ తదుపరి 3 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ను ఓడిస్తే 19 పాయింట్లతో ప్లేఆఫ్లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటుంది.

అదేవిధంగా, గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించినట్లయితే మొత్తం 18 పాయింట్లతో ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుంది.

కోల్కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మూడు మ్యాచ్ల్లో గెలిస్తే, అంటే, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులను ఓడించినట్లయితే, ఆ జట్టు మొత్తం 17 పాయింట్లతో ప్లేఆఫ్కు అర్హత సాధిస్తారు.

ఇదిలా ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోతే 16 పాయింట్లతో కొనసాగుతుంది.

ఇదే జరిగితే, RCB ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తదుపరి దశకు చేరుకుంటాయి. అందుకే, తదుపరి మ్యాచ్లు ఆర్సీబీ జట్టుకు కీలకం.




