AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Politics : రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ వెనుక ఇంత కుట్ర జరిగిందా.. బీసీసీఐపై మండిపాటు

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్టు రిటైర్మెంట్ ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో చాలా ప్రశ్నలు తలెత్తాయి.

BCCI Politics : రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ వెనుక ఇంత కుట్ర జరిగిందా.. బీసీసీఐపై మండిపాటు
Bcci Politics
Rakesh
|

Updated on: Aug 16, 2025 | 4:16 PM

Share

BCCI Politics : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంగ్లాండ్ పర్యటనకు సరిగ్గా ముందు, ఈ ఇద్దరు ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ నిర్ణయం వెనుక చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే, మాజీ భారత ఫాస్ట్ బౌలర్ కర్సన్ ఘావ్రీ ఈ విషయంపై ఒక సంచలన ఆరోపణ చేశారు. వారి రిటైర్‌మెంట్ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం కాదని, ఇది బీసీసీఐ,సెలెక్టర్ల అంతర్గత రాజకీయాల ఫలితమేనని ఆయన తెలిపారు.

కర్సన్ ఘావ్రీ అభిప్రాయం ప్రకారం.. విరాట్ కోహ్లీ కనీసం మరో రెండు సంవత్సరాలు టెస్ట్ జట్టులో కొనసాగవచ్చు. కానీ, కోహ్లీ వంటి ఒక గొప్ప క్రికెటర్‌కు బీసీసీఐ వీడ్కోలు మ్యాచ్ కూడా ఇవ్వకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ షోలో కోహ్లీ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం గురించి అడిగినప్పుడు.. ఘావ్రీ.. ఇది ఒక సీక్రెట్. కోహ్లీ తప్పకుండా మరికొన్నేళ్లు భారత్ తరపున ఆడాల్సి ఉండేది. కానీ ఏదో అతడిని రిటైర్మెంట్ తీసుకోవడానికి బలవంతం చేసిందని నేను భావిస్తున్నాను. అతను రిటైర్‌మెంట్ తీసుకున్నప్పుడు బీసీసీఐ అతనికి వీడ్కోలు కూడా ఇవ్వలేదు.” అని అన్నారు.

కర్సన్ ఘావ్రీ ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ భారత జట్టు మేనేజ్‌మెంట్‌లోని అంతర్గత రాజకీయాలకు బాధితులయ్యారని ఆరోపించారు. “ఇది బీసీసీఐ అంతర్గత రాజకీయాలు, వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే వారు ముందుగానే రిటైర్‌మెంట్ తీసుకున్నారని నేను భావిస్తున్నాను. రోహిత్ శర్మ కూడా ముందుగానే రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. వారిని బయటకు వెళ్లమని చెప్పబడింది. వారు వెళ్లాలని అనుకోలేదు. వారు కొనసాగాలని కోరుకున్నారు. కానీ సెలెక్టర్లు, బీసీసీఐ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఇది ఒక రకమైన రాజకీయ వ్యవహారం” అని ఘావ్రీ అన్నారు.

రోహిత్, విరాట్‌ల వంటి సీనియర్ ఆటగాళ్లను అకస్మాత్తుగా జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయాలు, కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం కల్పించడం వెనుక తీసుకున్నవని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ, అది ఎంతవరకు నిజమనేది ఇప్పటికీ చర్చనీయాంశమే.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నారు. అదేవిధంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో టెస్టులకు కూడా వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆడనుంది. అయితే, కొన్ని నివేదికల ప్రకారం ఈ పర్యటన రోహిత్, కోహ్లీకి చివరి పర్యటన కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..