IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నమెంట్ ప్రారంభమై ఒక వారం దాటింది. ఇప్పటివరకు మొత్తం పద్నాలుగు మ్యాచ్లు జరిగాయి. సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. రియాన్ పరాగ్ అజేయంగా 54 పరుగులు చేశాడు. ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీసి మెరిశాడు. ఐపీఎల్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానం నుంచి అగ్రస్థానంలో నిలిచింది. వారు ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి ఆరు పాయింట్లు సాధించారు అలాగే రన్ రేట్ +1.249లుగా నిలిచింది.
శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రెండో స్థానానికి పడిపోయింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి 4 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం నెట్ రన్ రేట్ +1.047లుగా నిలిచింది.
రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. ఆడిన మూడు మ్యాచ్లలో రెండు గెలిచింది. ఒకటి ఓడిపోయింది. నాలుగు పాయింట్లతో రన్ రేట్ +0.976లుగా నిలిచింది.
శుభమన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట్లో గెలిచి 4 పాయింట్లు సాధించింది. ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.738లుగా నిలిచింది.
కాగా, పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు పరాజయాలు, ఒక విజయం సాధించి 2 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ +0.204లుగా నిలిచింది.
కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక్కో విజయం, ఒక ఓటమి చవిచూసి 2 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో నెట్ రన్ రేట్ +0.025లుగా నిలిచింది.
రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓడి రెండు పాయింట్లతో ఒకటి గెలిచి ఏడో స్థానంలో ఉంది. ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.016లుగా నిలిచింది.
శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి రెండింట్లో ఓడి 2 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో ఉంది. నికర రన్ రేట్ +0.337లుగా నిలిచింది.
ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎనభైవ స్థానానికి పడిపోయింది. ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు పరాజయాలు, ఒక విజయం సాధించి 2 పాయింట్లు సాధించింది. ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.711లుగా నిలిచింది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడి పాయింట్లు సాధించకుండా పదో స్థానంలో ఉంది. ప్రస్తుత నెట్ రన్ రేట్ -1.423లుగా నిలిచింది.
ఆరెంజ్ క్యాప్ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ ర్యాన్ పరాగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఆడిన మూడు మ్యాచ్ల్లో మొత్తం 181 పరుగులు చేశాడు. అలాగే RCB స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా మూడు మ్యాచ్ల్లో 181 పరుగులు చేశాడు. కానీ, పరాగ్ సగటు ప్రాతిపదికన టాప్లో ఉన్నాడు. హైదరాబాద్కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లో 167 పరుగులు చేశాడు.
పర్పుల్ క్యాప్ జాబితాలో సీఎస్కే ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ మొత్తం 7 వికెట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతని వెనుక రాజస్థాన్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. అతను ఆడిన మూడు మ్యాచ్లలో 6 వికెట్లు తీసుకున్నాడు. గుజరాత్ జట్టుకు చెందిన మోహిత్ శర్మ 6 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..