Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?
Virat Kohli One8: విరాట్ కోహ్లీకి చెందిన వన్8 బ్రాండ్ బూట్లతో పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు కనిపించడం నెట్టింట వైరల్గా మారింది. హాంకాంగ్పై నాష్రా సంధు ఆరు వికెట్లతో చెలరేగిన మ్యాచ్లో ఈ బూట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాక్ జట్టు సెమీఫైనల్కు చేరగా, కోహ్లీ బ్రాండ్ బూట్లు పాక్ ప్లేయర్లు ధరించడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. సెప్టెంబర్ 11న శ్రీలంకతో సెమీఫైనల్ ఆడనుంది.

Virat Kohli One8: మహిళల ఆసియా కప్లో పాకిస్థాన్ స్పిన్నర్ నాష్రా సంధు ఆరు వికెట్లతో సంచలనం సృష్టించింది. హాంకాంగ్పై జట్టును గెలిపించిన ఆమె ఆట ఎంత చర్చనీయాంశమైందో, కాళ్లకు ధరించిన బూట్లు కూడా అంతే హాట్ టాపిక్గా మారాయి. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి చెందిన వన్8 బ్రాండ్ బూట్లతో పాక్ ప్లేయర్లు కనిపించడం నెట్టింట వైరల్ అవుతోంది. మహిళల ఆసియా కప్ గ్రూప్-ఎ మ్యాచ్లో హాంకాంగ్ చైనాతో జరిగిన పోరులో పాకిస్థాన్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. పాక్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ నాష్రా సంధు కేవలం 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చింది. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఆమెకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన వన్8 బూట్లు
నాష్రా సంధు సంచలన బౌలింగ్ గణాంకాలతో వార్తల్లో నిలవడమే కాకుండా, ఆమె ధరించిన షూస్ ద్వారా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. భారత క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న వన్8 స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ బూట్లను ఆమె ధరించి మైదానంలోకి దిగింది. నాష్రా ఒక్కరే కాదు, పాకిస్థాన్ జట్టులోని పలువురు మహిళా క్రికెటర్లు కూడా ఇదే బ్రాండ్ బూట్లతో కనిపించడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
క్రీడా ప్రపంచంలో విస్తరిస్తున్న కోహ్లీ బ్రాండ్
విరాట్ కోహ్లీ సహ భాగస్వామిగా ఉన్న వన్8 బ్రాండ్ మొదట్లో లైఫ్స్టైల్, దుస్తులకే పరిమితమైనప్పటికీ, ఇప్పుడు క్రీడాకారులకు అవసరమైన ప్రొఫెషనల్ గేర్ను తయారు చేస్తోంది. అగిలిటాస్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ, క్రికెట్ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా సీమ్, కవర్ డ్రైవ్ పేరుతో ప్రత్యేకమైన షూస్ను అందుబాటులోకి తెచ్చింది. కోహ్లీ స్వయంగా ఈ ఉత్పత్తుల డిజైనింగ్ అంశాల్లో భాగస్వామి కావడంతో వీటికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
Many players of Pakistan women team was wearing @one8world shoes in asia cup match. I have following questions 1. Products registered in india can’t be exported to pak ,so did this deal happened in Dubai? Where matches are being played 2.Aisi kya majburi thi @one8world pic.twitter.com/GkVdg3BfUG
— varun (@mystic_varunn) September 7, 2026
సెమీఫైనల్ పోరుపై పాక్ దృష్టి
హాంకాంగ్పై సాధించిన ఘనవిజయంతో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 11న జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది. సంధు వేసిన సంచలన స్పెల్, జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చిన నమ్మకంతో నాకౌట్ పోరులోనూ విజయం సాధించి ఫైనల్ చేరుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.
మైదానంలో సరిహద్దు పోరులు ఎలా ఉన్నా, క్రీడా పరికరాలు, బ్రాండ్ల విషయంలో ఆటగాళ్లు క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తారని ఈ సంఘటన నిరూపించింది. అయితే పాక్ క్రికెటర్లు ఈ బూట్లను కేవలం ఆటలోని కంఫర్ట్ కోసమే వేసుకున్నారా లేక దీని వెనుక వేరే కారణం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. సెమీఫైనల్లో శ్రీలంకపై కూడా పాక్ జట్టు ఇదే ఊపును కొనసాగిస్తుందో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
