AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మేడం సార్ మేడం అంతే! 19 వేల మంది పిల్లల కల నెరవేర్చిన అంబానీ వైఫ్!

ఐపీఎల్ 2025లో ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, 19 వేల పేద పిల్లల కలను నెరవేర్చారు. నీతా అంబానీ నేతృత్వంలో నిర్వహించిన ESA డే సందర్భంగా పిల్లలకు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించే అవకాశం కల్పించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ముంబై స్టేడియాన్ని శబ్దభరితంగా మార్చింది. ESA డే ద్వారా పిల్లలకు క్రికెట్ ద్వారా జీవితానికి కొత్త ప్రేరణను అందించారు.

Video: మేడం సార్ మేడం అంతే! 19 వేల మంది పిల్లల కల నెరవేర్చిన అంబానీ వైఫ్!
Nita Ambani
Narsimha
|

Updated on: Apr 27, 2025 | 7:30 PM

Share

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, ఈ మ్యాచ్‌లో 19 వేల మంది పేద పిల్లల కలను నెరవేర్చింది. నీతా అంబానీ తీసుకున్న ప్రత్యేక చర్యతో, 19 వేల మంది పిల్లలు ఈ రోజు స్టేడియానికి చేరుకొని ప్రత్యక్షంగా తమ అభిమాన క్రికెటర్లను చూడటమే కాకుండా, స్టేడియంలో తమ ఇష్టమైన జట్టును ఉత్సాహపూరితంగా అభివందించారు. 2010లో ముంబైలో ప్రారంభమైన ESA (Education and Sports for All) డే ఒక గొప్ప చొరవగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ నేపథ్యాల నుండి వచ్చిన పిల్లలకు ఉచితంగా మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పించడం ముంబై ఇండియన్స్ ధ్యేయంగా పెట్టుకుంది.

నీతా అంబానీ 2010లో “అందరికీ విద్య, క్రీడలు” అనే భావనను ముందుకు తెచ్చి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి దాదాపు 19 వేల మంది పిల్లలు వాంఖడే స్టేడియంలో కనిపించి వాతావరణాన్ని మరింత శబ్దభరితంగా, ఉత్సాహభరితంగా మార్చారు. పిల్లల కోసం ముంబై ఇండియన్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, వారు జీవితంలో తొలిసారి ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం పొందారు. లక్నోతో జరిగిన మ్యాచ్ ప్రారంభానికి ముందు నీతా అంబానీ మాట్లాడుతూ, “ఈ రోజు ముంబైలోని ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే వేలాది మంది చిన్నారులు తమ కలను నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నాం,” అని పేర్కొన్నారు.

ESA డే అనేది ముంబై ఇండియన్స్, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమం. దీని ద్వారా యువతకు క్రీడలు, విద్యా రంగాల్లో భాగస్వామ్యం కావడానికి ప్రోత్సాహం ఇస్తారు. 2010లో ప్రారంభమైన ఈ చొరవ, భవిష్యత్ తరాలను రెండింటినీ సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళేలా ప్రేరేపిస్తోంది. ముంబై ఇండియన్స్ వివిధ ఎన్జీవోలతో కలిసి పేద పిల్లలకు ప్రత్యక్ష క్రికెట్ అనుభూతిని అందించడమే కాకుండా, వారి జీవితాలకు కొత్త ప్రేరణనూ అందిస్తోంది. ఈరోజు వాంఖడే స్టేడియంలో కనిపించిన పిల్లల ఆనందం, వారిలో క్రియాశీలత పెంచే మోటివేషన్‌కు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..