AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2025: ఇక జన్మలో పాకిస్థాన్ మొహం చూడను! పాకీల పై షాకింగ్ కామెంట్స్ చేసిన కేన్ మామ సోపతి!

పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులు వేడెక్కుతున్న వేళ, డారిల్ మిచెల్ "ఇక జన్మలో పాకిస్తాన్ రాను" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు ఇతర విదేశీ ఆటగాళ్లు కూడా ప్రాణాల కోసం దుబాయ్‌కు పారిపోయారు. ఈ పరిణామాలు పాక్ క్రికెట్‌పై గట్టి దెబ్బగా మారాయి. ఆటగాళ్ల భద్రతపై ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

PSL 2025: ఇక జన్మలో పాకిస్థాన్ మొహం చూడను! పాకీల పై షాకింగ్ కామెంట్స్ చేసిన కేన్ మామ సోపతి!
Daryl Mitchell
Follow us
Narsimha

|

Updated on: May 11, 2025 | 3:59 PM

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు క్రీడా ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య రాజకీయ, భద్రతా పరిస్థితులు విషమించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) లాంటి పెద్ద లీగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పాక్‌లో ఉన్న అనేక విదేశీ క్రికెటర్లు తీవ్ర భయంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు దుబాయ్ చేరుకుంటున్నారు. తాజాగా, న్యూజిలాండ్‌కు చెందిన స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ పాకిస్తాన్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ “ఇక ఎప్పటికీ పాకిస్తాన్‌కు తిరిగి అని” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

డారిల్ మిచెల్‌తో పాటు సామ్ బిల్లింగ్స్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ లాంటి ఇతర ప్రముఖ విదేశీ ఆటగాళ్లు కూడా భద్రత కోసం పరుగులు పెట్టారని బంగ్లాదేశ్ ఆటగాడు రిషద్ హుస్సేన్ వెల్లడించాడు. దుబాయ్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ రిషద్, “మేమంతా అక్కడ నుండి తప్పించుకున్నాం. డారిల్ మిచెల్ మాతో మాట్లాడుతూ, ఇకపై పాకిస్తాన్ వెళ్లేది లేదని చెప్పాడు. మేమంతా భయంతో వణికిపోయాం,” అని చెప్పారు. ఈ వాతావరణంలో టామ్ కుర్రాన్ పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది. విమానాశ్రయం మూసివేయబడిందని తెలుసుకున్న కుర్రాన్ అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నాడని, అతన్ని ఓదార్చేందుకు ఇద్దరు ముగ్గురు అవసరమయ్యారని రిషద్ వివరించారు.

ఈ భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ కూడా ప్రభావితమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నగదుతో నిండిన లీగ్‌ను వారం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేసిన అనంతరం లీగ్‌ను మళ్లీ ప్రారంభించే తేదీని నిర్ణయిస్తామని పేర్కొంది. మొత్తం మీద, ఇండో-పాక్ ఉద్రిక్తతలు కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా, క్రీడలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు భద్రతా భయాలతో దేశం విడిచి వెళ్తుండటం, పాక్‌పై ఉన్న ఆందోళనలను బహిరంగంగా వ్యక్తపరచటం ఈ పరిస్థితుల తీవ్రమనాన్ని బలంగా వెల్లడిస్తోంది.

ఈ పరిణామాలు అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్‌పై ఉన్న నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పాకిస్తాన్‌లో మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు నిర్వహించాలంటే, ఆటగాళ్ల భద్రతకు గట్టి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలోనూ పాక్‌లో జరిగిన భద్రతా ఘటనల కారణంగా అనేక దేశాలు తమ జట్లు పంపడంలో ముందడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇది తీవ్రమైన ఎదురుదెబ్బగా మారింది. ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి రాజీ పడకూడదన్న సందేశాన్ని ఈ సంఘటనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..