వేలికి గాయం.. కారుతున్న రక్తం.. అయినా ఆటను వదల్లేదు

| Edited By:

Jul 04, 2019 | 2:12 PM

వరల్డ్‌కప్‌లో భాగంగా గత ఆదివారం ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి తమ సత్తాను చూపిస్తూ వచ్చిన ధోని, కేదార్ జాదవ్.. కీలక సమయంలో మాత్రం తేలిపోయారు. కేవలం సింగిల్‌ రన్‌లు మాత్రమే ఇస్తూ 31పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయారు. దీంతో వారిద్దరిపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. కావాలనే ధోని, జాదవ్ ఆడలేదంటూ కొందరు ధోనిని తీవ్రంగా కామెంట్లు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో […]

వేలికి గాయం.. కారుతున్న రక్తం.. అయినా ఆటను వదల్లేదు
Follow us on

వరల్డ్‌కప్‌లో భాగంగా గత ఆదివారం ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి తమ సత్తాను చూపిస్తూ వచ్చిన ధోని, కేదార్ జాదవ్.. కీలక సమయంలో మాత్రం తేలిపోయారు. కేవలం సింగిల్‌ రన్‌లు మాత్రమే ఇస్తూ 31పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయారు. దీంతో వారిద్దరిపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. కావాలనే ధోని, జాదవ్ ఆడలేదంటూ కొందరు ధోనిని తీవ్రంగా కామెంట్లు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ధోని రెండుసార్లు గాయపడ్డాడట.

కీపింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి, బ్యాటింగ్ చేస్తునప్పుడు మరోసారి ధోని బొటనవేలికి బలంగా బాల్ తగిలినట్లు సమాచారం. అయినా ఆ నొప్పిని భరిస్తూ ధోని తన శక్తి మేరకు ఆటను ఆడాడట. ఇక ధోని తన బొటన వేలిని నోట్లో పెట్టుకొని పీల్చిన రక్తం బయటకు ఉమ్మేసిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన ధోని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ ధోని.. నీ పట్టుదలకు సలామ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.