AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : 14 మ్యాచ్‌ల్లో ఒక్కటే హాఫ్ సెంచరీ.. లెక్కేస్తే ఒక్కో రన్‌కు రూ.9 లక్షలు.. నీకు రూ.27 కోట్లు దండగ

IPL 2026 : ఐపీఎల్ 2026 లో లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. రూ. 28. 05 కోట్ల ప్యాకేజీ అందుకున్న పంత్ చేసిన ప్రతి రన్‌కు లక్నో రూ. 9 లక్షలు ఖర్చు చేసింది.

IPL 2026 : 14 మ్యాచ్‌ల్లో ఒక్కటే హాఫ్ సెంచరీ.. లెక్కేస్తే ఒక్కో రన్‌కు రూ.9 లక్షలు.. నీకు రూ.27 కోట్లు దండగ
Rishabh Pant
Rakesh
|

Updated on: May 28, 2026 | 3:47 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 ముగిసేసరికి లక్నో సూపర్ జాయింట్స్ (LSG) ఫ్రాంచైజీకి కోలుకోలేని షాక్ తగిలింది. వరుసగా మూడో సీజన్లోనూ ఆ జట్టు కనీసం ప్లే-ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ 2026 సీజన్ లీగ్ స్టేజ్ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో లక్నో ఏకంగా 10వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎన్నో ఆశలు పెట్టుకుని రికార్డు స్థాయిలో రూ.27 కోట్ల భారీ ధర వెచ్చించి రిషబ్ పంత్‎ను కొనుగోలు చేసిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు ఈ సీజన్ ఒక పీడకలగా మిగిలిపోయింది. ఈ సీజన్లో లక్నో సూపర్ జాయింట్స్ ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్‌తో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ దారుణంగా ఉండటంతో లక్నో టేబుల్‌లో అట్టడుగు స్థానానికి పడిపోయింది.

టాస్ గెలిచినా మ్యాచ్ ఓడిపోయే రేంజ్‌లో సాగిన లక్నో ప్రస్థానంలో రిషబ్ పంత్ సంపాదన మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. మెగా వేలం కాంట్రాక్ట్ విలువ రూ.27 కోట్లు కాగా, ఈ సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్‌లకు గానూ మ్యాచ్‌కి రూ.7.5 లక్షల చొప్పున అదనంగా మరో రూ.1.05 కోట్ల మ్యాచ్ ఫీజు అందుకున్నాడు. అంటే ట్యాక్సులు, జరిమానాలు కాకుండా ఈ ఒక్క ఐపీఎల్ 2026 సీజన్ ద్వారానే రిషబ్ పంత్ ఏకంగా రూ.28,05,00,000 (రూ.28.05 కోట్లు) జేబులో వేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు.

ఇంత భారీ మొత్తం చెల్లించినందుకు పంత్ బ్యాటింగ్ లేదా కప్ కెప్టెన్సీతో ఏమైనా అద్భుతాలు చేశాడా అంటే అస్సలు లేదు. బ్యాటర్ల హవా నడుస్తున్న మోడ్రన్ టీ20 క్రికెట్లో పంత్ కేవలం 138.05 స్ట్రైక్ రేట్‌తో ఆడి విమర్శల పాలయ్యాడు. టోర్నీ ప్రారంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై చేసిన 68* (50 బంతుల్లో) పరుగుల ఇన్నింగ్స్ మినహాయిస్తే, మిగిలిన ఏ మ్యాచ్‌లోనూ పంత్ కనీసం 50 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు.

మొత్తంగా 14 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్ ఆడిన పంత్.. 28.36 సగటుతో కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్‌గా నంబర్ 3, నంబర్ 4, ఓపెనర్‌గా ఇలా రకరకాల పొజిషన్లలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టు కాంబినేషన్‌ను పూర్తిగా దెబ్బతీశాడనే విమర్శలు వచ్చాయి. ఇక వికెట్ కీపర్‌గా మాత్రం ఈ సీజన్లో 10 క్యాచ్‌లు అందుకున్నాడు.

రిషబ్ పంత్ అందుకున్న మొత్తం ప్యాకేజీ (రూ.28.05 కోట్లు)ని, అతను ఈ సీజన్లో చేసిన మొత్తం పరుగులతో (312 రన్స్) భాగించి చూస్తే లక్నో మేనేజ్‌మెంట్‌కు దిమ్మతిరిగే లెక్క తేలింది. ఈ సీజన్లో రిషబ్ పంత్ చేసిన ప్రతీ ఒక్క రన్‌కు లక్నో సూపర్ జాయింట్స్ ఏకంగా రూ.8,99,038 (దాదాపు రూ.9 లక్షలు) ఖర్చు చేసింది. ఒక బ్యాటర్ చేసిన సింగిల్ రన్‌కు ఈ స్థాయిలో ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఇంత భారీ ధర చెల్లించలేదు.

పంత్ బ్యాటింగ్ సామర్థ్యంపై సంజీవ్ గోయెంకాకు నమ్మకం ఉన్నప్పటికీ, అతని పేలవమైన కెప్టెన్సీ, వ్యూహాత్మక లోపాలపై లక్నో డైరెక్టర్ టామ్ మూడీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తూ జట్టులో రీసెట్ అవసరమని హింట్లు ఇచ్చారు. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే పంత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, ఒత్తిడి లేకుండా కేవలం ప్యూర్ బ్యాటర్‌గా మాత్రమే ఆడించేలా లక్నో థింక్ ట్యాంక్ గట్టి ప్లాన్ చేస్తోందని సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us