రాయుడు నువ్వు గొప్ప వ్యక్తివి : కోహ్లి

తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ‘రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. రాయుడు నువ్వు గొప్ప వ్యక్తివి’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశాడు. కాగా వరల్డ్ కప్ టీంలోకి స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న తనని కాదని..మయాంక్ అగర్వాల్‌ని తీసుకోవడంతో రాయుడు తీవ్ర మనస్తాపం చెంది రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. కాగా రాయుడికి బీసీసీఐలోని రాజకీయాల వల్లే అన్యాయం జరిగిందంటూ […]

రాయుడు నువ్వు గొప్ప వ్యక్తివి : కోహ్లి
Follow us

|

Updated on: Jul 04, 2019 | 2:30 PM

తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ‘రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. రాయుడు నువ్వు గొప్ప వ్యక్తివి’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశాడు. కాగా వరల్డ్ కప్ టీంలోకి స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న తనని కాదని..మయాంక్ అగర్వాల్‌ని తీసుకోవడంతో రాయుడు తీవ్ర మనస్తాపం చెంది రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు.

కాగా రాయుడికి బీసీసీఐలోని రాజకీయాల వల్లే అన్యాయం జరిగిందంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మాజీ క్రికెటర్ గంభీర్ సైతం సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. ఆ కమిటీలోని ఐదుగురు కలిసి కూడా రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదంటూ చురకలంటించాడు.