AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఇట్స్ అఫీషియల్.. ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక మార్పు.. పూర్తి వివరాలు ఇదిగో

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 18వ ఎడిషన్‌కు సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తి కాగా, ఇప్పుడు ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ తేదీని ఖరారు చేశారు. అయితే ఈసారి వేలం ప్రక్రియ విదేశాల్లో జరగనుంది. కాబట్టి, వేలం ఎక్కడ జరగనుంది? ఎప్పుడనే తదితర వివరాలు తెలుసుకుందాం రండి.

IPL 2025: ఇట్స్ అఫీషియల్.. ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక మార్పు.. పూర్తి వివరాలు ఇదిగో
Ipl 2025 Mega Auction
Basha Shek
|

Updated on: Nov 06, 2024 | 12:02 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ తేదీ ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం (నవంబర్ 05) అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగాల్సిన వేలం ప్రక్రియను జెడ్డాకు మార్చారు. ఈసారి మెగా వేలం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మరియు అర్ష్‌దీప్ సింగ్ వంటి భారత క్రికెట్ స్టార్‌లను వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడతాయి. 2025 IPL మెగా వేలానికి ముందు మొత్తం 10 IPL ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబర్ 31న విడుదల చేశాయి. కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐ రిటెన్షన్ నిబంధనను పూర్తిగా వినియోగించుకోగా, కొన్ని ఫ్రాంచైజీలు కొద్ది మంది ఆటగాళ్లను మాత్రమే జట్టులో ఉంచుకుని మిగిలిన వారిని విడుదల చేశాయి. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలన్నీ మెగా వేలంపై కన్నేశాయి. ఎందుకంటే మెగా వేలంలో జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడమే ఈ ఫ్రాంచైజీల ప్రధాన లక్ష్యం.

IPL 2025కి ముందు, BCCI అన్ని ఫ్రాంచైజీల పర్స్ పరిమాణాన్ని పెంచింది. గతంలో ఒక్కో జట్టుకు రూ.100 కోట్లు చెల్లించేవారు. ఈ మొత్తంతో ఆటగాళ్లను కొనుగోలు చేసేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఫ్రాంచైజీలకు రూ.125 కోట్ల పర్స్ మనీ ఉండనుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వద్ద భారీ మొత్తంలో పర్స్ ఉంది. ఈ ఫ్రాంచైజీ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఈ టీమ్ వద్ద సుమారు రూ.110.5 కోట్ల బ్యాలెన్స్ ఉంది. RCBతో 83 కోట్లు, SRHతో 45 కోట్లు, LSGతో 69 కోట్లు, రాజస్థాన్‌తో 79 కోట్లు, CSKతో 69 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద  73 కోట్లు. డబ్బు ఉంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే 10 మంది ఫ్రాంచైజీలను కొనసాగించారు. ఈ 10 జట్లు మొత్తం 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ప్రస్తుతం వేలంలో 204 మంది ఆటగాళ్లు ఉండగా, అందులో 70 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన ఆటగాడు ఏ జట్టులోకి వస్తాడనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..