ఆ ఇద్దరి వల్లే ఐపీఎల్ వాయిదా పడిందా..? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..! తెలుసుకోండి..
IPL 2021 Postponed : కరోనా కారణంగా ఐపీఎల్ 14 వ సీజన్ వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
IPL 2021 Postponed : కరోనా కారణంగా ఐపీఎల్ 14 వ సీజన్ వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పలువురు ఆటగాళ్ళు, అధికారుల నుంచి వచ్చిన కరోనా నివేదికలు పాజిటివ్గా తేలాయి. తరువాత బయో బబుల్ పై ప్రశ్నలు వచ్చాయి. బయో-బబుల్ ఉన్నప్పటికీ కరోనా ప్రవేశం వెనుక గల కారణాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో అక్రమంగా మైదానంలోకి ప్రవేశించడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. మే 2న మ్యాచ్ సందర్భంగా ఇద్దరు బుకీలు అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నకిలీ పాస్ దొరికింది. వారిద్దరిపై కేసు నమోదైంది. ఐపిఎల్ను బయో బబుల్లో నిర్వహించారు అయితే అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మరి వీరు ఎందుకు వచ్చారని అనుమానం కలుగుతోంది.
టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 2021 మ్యాచ్లో బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది.