AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction: పర్సు వాల్యు ₹41 కోట్లు.. ఆ కీలక ప్లేయర్ల కోసం రాజస్థాన్ రాయల్స్ వ్యూహం

రాజస్థాన్ రాయల్స్ (RR) ఐపీఎల్ 2025 మెగా వేలానికి ₹41 కోట్లు బడ్జెట్‌తో సిద్ధమైంది. జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు చూస్తోంది, వీరిలో డేవిడ్ మిల్లర్, జెరాల్డ్ కోట్జీ, టీ. నటరాజన్, రచిన్ రవీంద్ర, అర్షదీప్ సింగ్ వంటి ఆటగాళ్లు ఉంటారు. బడ్జెట్-ఫ్రెండ్లీ విదేశీ ఆల్‌రౌండర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్‌ను కూడా పరిశీలిస్తున్నారు.

IPL Auction: పర్సు వాల్యు ₹41 కోట్లు.. ఆ కీలక ప్లేయర్ల కోసం రాజస్థాన్ రాయల్స్ వ్యూహం
Jos Buttler And David Miller
Narsimha
|

Updated on: Nov 19, 2024 | 1:37 PM

Share

రాజస్థాన్ రాయల్స్ (RR) తమ ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది, నవంబర్ 24, 25 తేదీలలో జెడ్డాలో జరగనున్న ఈ వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకునే పనిలో పడింది ఆర్ఆర్.. ఇప్పటికే ఆరుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఈ జట్టు, తమ జాబితాను పూర్తి చేయడానికి వారి పర్సులో ₹41 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

41 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తోనే 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంన్ని రాయల్స్ వేలాన్ని పూర్తిచేయాల్సిన అవసరముంది. సంజు శాంసన్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తూ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురేల్, షిమ్రాన్ హెట్మైర్, ఇంకా అన్‌క్యాప్డ్ ప్లేయర్ సందీప్ శర్మలను రిటైన్ చేశారు. జట్టు మేనేజ్‌మెంట్ వ్యూహాత్మక దృష్టితో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఇక్కడ అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను వదిలివేయడం. బట్లర్ స్థానంలో రాజస్థాన్ తమ బ్యాటింగ్‌ను బలపరచడానికి గతంలో ఆ జట్టుకు ఆడిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ను పరిశీలించే అవకాశం ఉంది.

జట్టు బౌలింగ్ విభాగంలో కూడా గ్యాప్‌లను పూరించాల్సి ఉంది. దక్షిణాఫ్రికా ఆటగాడు జెరాల్డ్ కోట్జీ, భారత బౌలర్ టీ. నటరాజన్ లాంటి ఆటగాళ్లు ఆర్ఆర్ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నారు. గత సీజన్‌లో జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడంపై ఆ ప్రాంచైజీ ఆలోచిస్తోందట.

ఆల్‌రౌండర్, బౌలింగ్ ఎంపికలను బలపరచడంపై జట్టు దృష్టి సారించనుంది. ద స్పోర్టింగ్ న్యూస్ ప్రకారం, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, భారత ప్రముఖ బౌలర్ అర్షదీప్ సింగ్, అలాగే అనుభవజ్ఞులైన ట్రెంట్ బౌల్ట్, మార్కస్ స్టోయినిస్ వంటి ఆటగాళ్లను జట్టు తమ జాబితాలో చేర్చుకోవచ్చు.

తక్కువ నిధులతో బడ్జెట్-ఫ్రెండ్లీ విదేశీ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయడం వారి ముందు ఉన్న సవాల్.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ని తీసుకోవడం కోసం ఆ జట్టు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ దృష్టిపెట్టబోయే కీలక ప్లేయర్లు..

1. బ్యాటింగ్ విభాగం:

డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా): బట్లర్ స్థానంలో వచ్చే బెస్ట్ చాయిస్. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్): టీ20లో ఆల్‌రౌండర్ కాస్త బ్యాటింగ్‌కు సపోర్ట్ ఇస్తాడు.

2. బౌలింగ్ విభాగం:

యుజ్వేంద్ర చాహల్: గత సీజన్‌లో టాప్ వికెట్ టేకర్, అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవడం ప్రాధాన్యత. గెరాల్డ్ కోయెట్జీ (SA): యువ పేసర్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్. T. నటరాజన్: ఇండియన్ పేసర్, డెత్ బౌలింగ్‌లో నైపుణ్యం కలవాడు. అర్ష్‌దీప్ సింగ్: టీ20లో భారత ప్రధాన పేసర్.

3. ఆల్‌రౌండర్లు:

ట్రెంట్ బౌల్ట్ (NZ): అనుభవజ్ఞుడు, బౌలింగ్‌లో కీలక ప్రాతినిధ్యం. మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా): పవర్ హిట్టింగ్ మరియు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. జాకబ్ బెథెల్ (ఇంగ్లాండ్): తక్కువ బడ్జెట్‌లో మంచి ఆప్షన్.

Follow Us