AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌ బ్రేక్..

Vijay Sethupathi: అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌ బ్రేక్..

Anil kumar poka
|

Updated on: Dec 22, 2024 | 12:12 PM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం కేవలం కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసింది. నిజానికి కోవిడ్ తర్వాత సినిమాల వసూళ్లు పెరిగాయి. సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెరిగాయి. అయితే ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘దంగల్’ మొదటి స్థానంలో ఉండగా, ‘బాహుబలి 2’ తర్వాతి స్థానంలో ఉంది.

సినిమాలు విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా రికార్డును మరే సినిమా బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు అతి చిన్న బడ్జెట్ సినిమా ‘బాహుబలి’ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఆ సినిమా ఏదో కాదు విజయ్ సేతుపతి నటించిన మహారాజా. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన తమిళ చిత్రం ‘మహారాజా’ ఇప్పుడు ‘బాహుబలి’ సినిమా రికార్డును బద్దలు కొట్టింది. ‘బాహుబలి 2’ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయలేదు. దానికి బదులు విదేశాల్లో ముఖ్యంగా ఒక దేశంలో సినిమా కలెక్షన్ల విషయంలో ‘బాహుబలి 2’ను అధిగమించింది.ఈ ఏడాది జూన్‌లో ‘మహారాజా’ సినిమా థియేటర్లలో విడుదలైంది. అద్భుతమైన కథ, కథనం, నటనతో ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండియాలో ఇప్పటికే 180 కోట్లకు పైగా వసూలు చేసింది. కొద్ది రోజుల క్రితం చైనాలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా అద్భుతంగా వసూళ్లు రాబడుతోంది. చైనాలోని ప్రేక్షకులను ‘మహారాజా’ సినిమాను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చైనాలో హౌస్ ఫుల్ షోస్ తో దూసుకుపోతోంది.

‘మహారాజా’ కేవలం కొద్ది రోజుల్లోనే చైనా బాక్సాఫీస్‌లో 76.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 చైనా మార్కెట్‌లో రూ.64 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ‘బాహుబలి 2’ రికార్డును బద్దలు కొట్టిన ‘మహారాజా’ చైనా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. అంతే కాదు ‘దంగల్’ సినిమా రికార్డును కూడా బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించారు. ఈ చిత్రానికి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.