MS Dhoni: ఇకపై ఐపీఎల్‌కు ధోనీ అవసరం లేదు.. కేకేఆర్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీపై చర్చ మొదలైంది. 45 ఏళ్ల వయసులోనూ లీగ్ లో కొనసాగుతున్న ధోనీ ప్రాముఖ్యతపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ఇప్పుడు ఒక మహా వృక్షంలా ఎదిగిందని అది ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడి లేదని ఆయన స్పష్టం చేశారు.

MS Dhoni: ఇకపై ఐపీఎల్‌కు ధోనీ అవసరం లేదు.. కేకేఆర్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
మీడియా నివేదికల ప్రకారం, ఏప్రిల్ 11, 2026న ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న స్వదేశీ మ్యాచ్‌కు కూడా ధోనీ దూరమవుతాడు. అయితే, ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో అతను మైదానంలో ఉంటాడని సమాచారం. అయినప్పటికీ, దీనిపై సీఎస్‌కే యాజమాన్యం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Updated on: Mar 27, 2026 | 9:45 AM

MS Dhoni Retirement: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 278 మ్యాచ్‌లు ఆడిన రికార్డ్ ధోనీ పేరిట ఉంది. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జైంట్స్ తరపున ఆడిన ఆయన వికెట్ కీపర్ బ్యాటర్‌గా 5000కు పైగా పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గత కొన్నేళ్లుగా మోకాలి గాయంతోపాటు సర్జరీ కారణంగా ధోనీ తన బ్యాటింగ్ క్రమాన్ని 7 లేదా 8వ స్థానానికి పరిమితం చేసుకున్నాడు. గత సీజన్‌లో ఆయన స్ట్రైక్ రేట్ కూడా గణనీయంగా తగ్గడం విమర్శలకు తావిస్తోంది.

ఐపీఎల్ ఎవరి కోసం ఆగదు: ఆకాష్ చోప్రా..

మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఐపీఎల్ ఇప్పుడు ఎవరి చేతిని పట్టుకోవాల్సిన అవసరం లేని స్థాయికి చేరుకుందని అభిప్రాయపడ్డారు. ఒక చిన్న బిడ్డ నడవడానికి వేలు పట్టుకోవడం అవసరమని, కానీ నేడు ఆ బిడ్డ ఇప్పుడు పరిగెడుతున్నాడని ఆయన పోల్చారు. ధోనీ వంటి దిగ్గజాలు ఉన్నా లేకపోయినా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ, ఆదరణ తగ్గబోదని ఆయన పేర్కొన్నారు.

బాధ్యత, వీడ్కోలు..

ధోనీకి ఆటపై ఉన్న మక్కువతోనే ఆయన ఇంకా కొనసాగుతున్నారని చోప్రా అన్నారు. అయితే తన వల్ల జట్టుకు నష్టం జరుగుతుందని తాను క్యాచ్‌లు వదిలేస్తున్నానని లేదా సిక్సర్లు కొట్టలేకపోతున్నానని ధోనీ భావించిన మరుక్షణమే ఆయన స్వచ్ఛందంగా తప్పుకుంటారని వెల్లడించారు. 2026 సీజన్ ధోనీకి చివరిది అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

సీఎస్కే వ్యూహం ఏంటి..?

ధోనీ కేవలం ఆటగాడు మాత్రమే కాదు జట్టుకు ఒక మెంటార్‌గా కూడా కీలకం. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ రోహిత్ శర్మ సేనను ఆయన స్టాండ్స్ నుంచి ప్రోత్సహించడం చూశాం. అలాంటి మేధావిని కోల్పోవడానికి ఏ జట్టు ఇష్టపడదు. మార్చి 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌తో చెన్నై ప్రస్థానం మొదలుకానుంది. ఆ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్, ప్రదర్శనపై అందరి కళ్లు ఉండనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us