IPL 2025: రికీ పాంటింగ్ పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. కొత్త కోచ్గా ఎవరు రానున్నారంటే?
ఐపీఎల్ 2025కి ఇంకా చాలా సమయం ఉంది. అయితే అంతకంటే ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మార్పులు మొదలయ్యాయి. ఈ సీజన్ లో ప్లే ఆఫ్ట్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో జట్టుతో పాటు కోచింగ్ సిబ్బంది లోనూ ప్రక్షాళన మొదలైంది

ఐపీఎల్ 2025కి ఇంకా చాలా సమయం ఉంది. అయితే అంతకంటే ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మార్పులు మొదలయ్యాయి. ఈ సీజన్ లో ప్లే ఆఫ్ట్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో జట్టుతో పాటు కోచింగ్ సిబ్బందిలోనూ ప్రక్షాళన మొదలైంది. తాజాగా ఆ జట్టు మొదటి వికెట్ పడింది. 2018 నుండి జట్టుకు ప్రధాన కోచ్గా రికీ పాంటింగ్ ను తప్పించారు. వాస్తవానికి 2018లో ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన పాంటింగ్ ఒక్కో ఎడిషన్కు రూ.3.5 కోట్లు చెల్లించారు. కానీ పాంటింగ్ హయాంలో జట్టు ప్రదర్శన ఏ మాత్రం బాగోలేదు. గత ఎడిషన్లో మాదిరిగానే ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమై ఆరో స్థానంలో నిలిచింది. దీంతో పాంటింగ్ ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగిస్తూ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రికీ పాంటింగ్ను ఆ పదవి నుంచి తొలగించేందుకు కారణాన్ని వెల్లడించిన ఫ్రాంచైజీ, జట్టు పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. కాగా సౌరవ్ గంగూలీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు.
పాంటింగ్ ప్రధాన కోచ్ అయిన తర్వాత, జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. పాంటింగ్ కోచ్గా ఉన్నప్పటికీ, ఢిల్లీ జట్టు వరుసగా మూడో సారి ప్లే-ఆఫ్కు అర్హత సాధించలేకపోయింది. ఈ కారణంగానే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్పై వేటు పడింది. ఇది కాకుండా, ఇప్పుడు రికీ పాంటింగ్ స్థానంలోప్రధాన కోచ్ పదవిని గంగూలీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పాంటింగ్ తొలగింపును ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంత కాలం పాటు జట్టుకు సేవలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
After 7 seasons, Delhi Capitals has decided to part ways with Ricky Ponting.
It’s been a great journey, Coach! Thank you for everything 💙❤️ pic.twitter.com/dnIE5QY6ac
— Delhi Capitals (@DelhiCapitals) July 13, 2024
రికీ పాంటింగ్ 7 సీజన్లుగా ఢిల్లీ కోచ్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అయితే 2020లో ఒక్కసారి మాత్రమే జట్టును ఫైనల్కు తీసుకెళ్లగలిగాడు. కానీ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత అతని హయాంలో ఢిల్లీ జట్టు తొలి సీజన్లో చివరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జట్టు 2019, 2020 మరియు 2021లో ప్లే-ఆఫ్లకు అర్హత సాధించింది, కానీ ట్రోఫీని గెలుచుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత 3 సీజన్లలో ప్లే ఆఫ్కు చేరుకోవడంలో విఫలమయ్యారు.
He saw the future in them, they saw him lead by example &, the rest is history 💙
Our #BirthdayBoy certainly redefined Indian Cricket with his aura & leadership 👏 pic.twitter.com/b9uw9xFH47
— Delhi Capitals (@DelhiCapitals) July 8, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




