AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024:ట్రోలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి.. హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. మూడో మ్యాచ్‌కు ముందే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌ని మార్చాలని తీసుకున్న నిర్ణయం హార్దిక్ కు శరాఘాతంలా మారింది. ఇందులో అతని తప్పేమీ లేకున్నా క్రికెట్ అభిమానులు ప్యాండ్యాను టార్గెట్ చేస్తున్నారు. నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు

IPL 2024:ట్రోలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి.. హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. మూడో మ్యాచ్‌కు ముందే..
Hardik Pandya
Basha Shek
|

Updated on: Mar 30, 2024 | 5:35 PM

Share

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌ని మార్చాలని తీసుకున్న నిర్ణయం హార్దిక్ కు శరాఘాతంలా మారింది. ఇందులో అతని తప్పేమీ లేకున్నా క్రికెట్ అభిమానులు ప్యాండ్యాను టార్గెట్ చేస్తున్నారు. నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు హార్దిక్ కెప్టెన్సీలో వరుసగా 2 పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఈ విమర్శల దాడి మరింత ఎక్కువైంఇ. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజయల్స్ తో జరిగే మ్యాచ్ కు ముందు హార్దిక్ పాండ్యా‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముంబై తన తొలి 2 మ్యాచ్‌లను గుజరాత్, హైదరాబాద్‌తో ఆడింది. ఏప్రిల్ 1న ముంబై హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో మూడో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు ఇప్పటికే ముంబై నగరానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హార్దిక్ ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు హార్దిక్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నివేదికల ప్రకారం, హార్దిక్ తన కుటుంబంతో సమయం గడపనున్నాడట.

నివేదికల ప్రకారం, హార్దిక్ ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే తన ఇంటికి బయలుదేరాడు. ముంబైలోని హార్దిక్ ఇంటికి వెళ్లాడు. ఓవైపు విమర్శలు మరోవైపు రెండు ఓటముల ల తరువాత, హార్దిక్ తన కుటుంబంతో కొన్ని గంటలపాటు కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ బ్రేక్ తో తనపై వస్తోన్న విమర్శలకు హార్దిక్ చెక్ పెడతాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

నేరుగా ఇంటికే..

ఇదిలా ఉంటే ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా 2012లో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. అప్పటి నుంచి ముంబై తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలోనూ పరాజయం పాలైంది.

ముంబై ఇండియన్స్ జట్టు:

హార్దిక్ పాండ్యా (కుడి), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, నెహాల్ వధేరా, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ గోపాల్, ము వినోద్, ము వినోద్, ., రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, శివలిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్, ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, డెవాల్డ్ బ్రూయిస్, క్వేనా మఫాకా, నమన్ ధీర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..
రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు
ఎన్ని న్యూక్లియర్ బాంబులు పడితే.! భూమిపై లైఫ్ అంతమవుతుంది
ఎన్ని న్యూక్లియర్ బాంబులు పడితే.! భూమిపై లైఫ్ అంతమవుతుంది
భార్యను హత్య చేసిన భర్త, ప్రియుడు.. కారణం అదేనా..
భార్యను హత్య చేసిన భర్త, ప్రియుడు.. కారణం అదేనా..
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం