IPL 2024: గుజరాత్ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ.. రోడ్డు ప్రమాదంలో 3.6 కోట్ల ప్లేయర్‌కు గాయాలు..

లీగ్ ప్రారంభానికి ముందు, టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ ఫ్రాంచైజీని వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ తర్వాత, జట్టు స్టార్ బౌలర్‌ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం లీగ్‌కు దూరమయ్యాడు. షమీతో పాటు ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ కూడా గాయం కారణంగా లీగ్‌లో ఆడేందుకు అందుబాటులో లేడు. ఇంతలో ఆ జట్టులోని ఓ యువ ఆటగాడు ప్రమాదానికి గురయ్యాడు.

IPL 2024: గుజరాత్ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ.. రోడ్డు ప్రమాదంలో 3.6 కోట్ల ప్లేయర్‌కు గాయాలు..
Robin Minz

Updated on: Mar 03, 2024 | 4:44 PM

ఐపీఎల్ 17వ ఎడిషన్ (ఐపీఎల్ 2024) ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి . ఇదిలా ఉంటే లీగ్ లో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. లీగ్ ప్రారంభానికి ముందు, టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ ఫ్రాంచైజీని వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ తర్వాత, జట్టు స్టార్ బౌలర్‌ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం లీగ్‌కు దూరమయ్యాడు. షమీతో పాటు ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ కూడా గాయం కారణంగా లీగ్‌లో ఆడేందుకు అందుబాటులో లేడు. ఇంతలో ఆ జట్టులోని ఓ యువ ఆటగాడు ప్రమాదానికి గురయ్యాడు. 21 ఏళ్ల రాబిన్ మింజ్ తన కవాసకి సూపర్ బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి మరో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రిలో చేర్పించారు. అదృష్టవశాత్తూ, రాబిన్‌కు పెద్దగా గాయాలు కాలేదు. అయితే బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం గురించి రాబిన్ తండ్రి తెలియజేసారు, రాబిన్ పరిస్థితి విషమంగా లేదు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బైక్ ముందు భాగం పాడైందని, మింజ్ కుడి మోకాలికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

కొన్ని నెలల క్రితం దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన సీకే నాయుడు ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్.. కర్ణాటకతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 137 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చిన రాబిన్.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నిర్వహించే ప్రాక్టీస్ క్యాంపులో పాల్గొనాల్సి ఉంది. ప్రమాదం కారణంగా శిబిరంలో పాల్గొనడం ఆలస్యమవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

నిజానికి, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ముగిసిన తర్వాత రాంచీ నుంచి విమానం ఎక్కుతుండగా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్‌ను కలిశాడు. రాంచీ విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ మింజ్ భారత క్రికెటర్లందరితో సంభాషించాడు. ఐపీఎల్‌లో అతని కొడుకు కెప్టెన్ గిల్‌ను కలిసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. రాబిన్ తండ్రి, ఫ్రాన్సిస్ జేవియర్ మింజ్ దాదాపు రెండు దశాబ్దాలుగా సైన్యంలో పనిచేశారు. ప్రస్తుతం విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.

రాబిన్ తండ్రితో మాట్లాడుతున్న గిల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..