Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: వర్షం కారణంగా గుజరాత్, ముంబై క్వాలిఫయర్ 2 రద్దైతే.. చెన్నైతో ఢీకొట్టేది ఎవరు?

GT vs MI: అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో సీఎస్‌కేతో ఏ జట్టు ఆడుతుందనే సందిగ్ధం నెలకొంది. అయితే, ఇందుకోసం కొన్ని నియమాలు కూడా నిర్ణయించారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఏ జట్టుకు ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2023: వర్షం కారణంగా గుజరాత్, ముంబై క్వాలిఫయర్ 2 రద్దైతే.. చెన్నైతో ఢీకొట్టేది ఎవరు?
Gt Vs Mi Ipl 2023
Follow us
Venkata Chari

|

Updated on: May 25, 2023 | 6:04 PM

Gujarat Titans vs Mumbai Indians: ఐపీఎల్ (IPL 2023 Qualifier 2) రెండో క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. బుధవారం జరిగిన తొలి ఎలిమినేటర్‌లో ముంబై జట్టు లక్నో జట్టును ఓడించి, తర్వాతి రౌండ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది. మే 26, శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ భారీ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో సీఎస్‌కేతో ఏ జట్టు ఆడుతుందనే సందిగ్ధం నెలకొంది. అయితే, ఇందుకోసం కొన్ని నియమాలు కూడా నిర్ణయించారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఏ జట్టుకు ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్‌లో లీగ్ రౌండ్‌లో మ్యాచ్ రద్దు అయితే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఐపీఎల్ నిబంధనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా క్వాలిఫయర్లు రద్దైతే.. ఫైనల్ రౌండ్‌లోకి ఏ జట్టు ప్రవేశిస్తుందనే ప్రశ్న చాలా మంది క్రికెట్ ప్రేమికుల మదిలో మెదులుతోంది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫయర్స్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో సీఎస్‌కేతో ఆడే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా ముంబై ఇండియన్స్‌కు అవకాశం లభించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిబంధన ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే లీగ్ టేబుల్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌లో ఆడుతుంది. ఐపీఎల్ లీగ్ రౌండ్‌లో 10 మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్ జట్టు 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై 14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లు మాత్రమే సాధించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా క్వాలిఫయర్-2 రద్దైతే గుజరాత్ టైటాన్స్ జట్టు ఆఖరి రౌండ్‌లో ఆడుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..