AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఇకపై వీళ్లు వన్డేలకు పనికిరారు.. తేల్చేసిన గంభీర్.. ఛాంపియన్స్ ట్రోఫీ లిస్టులో ఆ ఇద్దరికి చోటు?

Indian Cricket Team: జస్ప్రీత్ బుమ్రా కూడా వన్డే సిరీస్ నుంచి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. జట్టులోని అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్‌ అలసిపోకుండా చూసుకోవాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత పని కోసం ఈ ఫార్మాట్ నుంచి విరామం కోరాడు. హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, 197 ODIలు ఆడిన రవీంద్ర జడేజా ఇకపై వైట్ బాల్ ఫార్మాట్ కోసం సెలెక్టర్ల పథకంలో భాగం కాదని BCCI మూలాలు తెలిపాయి.

Team India: ఇకపై వీళ్లు వన్డేలకు పనికిరారు.. తేల్చేసిన గంభీర్.. ఛాంపియన్స్ ట్రోఫీ లిస్టులో ఆ ఇద్దరికి చోటు?
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Jul 20, 2024 | 7:45 AM

Share

Team India: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత T20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడవ ఆటగాడు రవీంద్ర జడేజా. అయితే, వన్డేలకు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. కానీ, టీమిండియా ప్రధాన కోచ్, సెలెక్టర్లు మాత్రం జడేజాను విస్మరించినట్లు తెలుస్తుంది. భారత్-శ్రీలంక మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చేర్చారు. అయితే రవీంద్ర జడేజాను మాత్రం ఈ సిరీస్‌లో భాగం చేయలేదు. హార్దిక్ పాండ్యాతో పాటు ఈ ఫార్మాట్‌లో చాలా మంది పేర్లు మిస్సయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే వారి కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు.

జడేజా లేకుండానే ముందుకు వెళ్లాలని బోర్డు నిర్ణయం..

జస్ప్రీత్ బుమ్రా కూడా వన్డే సిరీస్ నుంచి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. జట్టులోని అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్‌ అలసిపోకుండా చూసుకోవాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత పని కోసం ఈ ఫార్మాట్ నుంచి విరామం కోరాడు. హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, 197 ODIలు ఆడిన రవీంద్ర జడేజా ఇకపై వైట్ బాల్ ఫార్మాట్ కోసం సెలెక్టర్ల పథకంలో భాగం కాదని BCCI మూలాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, భారత్ 6 వన్డేలు ఆడాల్సి ఉంది. ఇందులో శ్రీలంకతో మూడు వన్డేలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం చేయాలని హెడ్ కోచ్ గంభీర్, సెలక్టర్లు భావిస్తున్నారు.

జడేజా కొన్నేళ్లుగా టీమిండియా తరపున వన్డేల్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. 2009లో అరంగేట్రం చేసిన తర్వాత భారత్ 354 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో జడేజా మొత్తం 197 వన్డేలు ఆడాడు. గత ఏడాది జరిగిన ODI ప్రపంచకప్ 2023లో అతను అన్ని మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నాడు.

జడేజా ప్రదర్శన గురించి మాట్లాడితే, ఈ స్టార్ ఆల్ రౌండర్ 2019 ప్రపంచకప్ తర్వాత ఇప్పటివరకు మొత్తం 44 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో, అతను 40 సగటు, 84 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 644 పరుగులు చేశాడు. బంతితో 44 వికెట్లు తీశాడు. ఈ కాలంలో అతని సగటు 37గా నిలిచింది. ఈ కాలంలో అతని ఎకానమీ రేటు 4.9గా నిలిచింది. జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ కనిపిస్తుంటాడు. బ్యాటింగ్‌లో జడేజా కంటే అక్షర్ ముందున్నాడు. ఇది కాకుండా జడేజా కంటే అక్షర్ స్పిన్‌లో అద్భుతాలు చేస్తుంటాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..