India vs UAE: కుల్దీప్, దూబేల మాయాజాలం.. 57 పరుగులకే యూఏఈ ఆలౌట్..
India vs UAE, Asia Cup 2025: ఆసియా కప్లో తన తొలి మ్యాచ్లో భారత్ 13.1 ఓవర్లలో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. టీ20 క్రికెట్లో భారత్పై ఏ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు ఇది. అలాగే, ఈ ఫార్మాట్లో యూఏఈకి ఇదే అత్యల్ప స్కోరు.

India vs UAE, Asia Cup 2025: ఆసియా కప్లో తన తొలి మ్యాచ్లో భారత్ 13.1 ఓవర్లలో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. టీ20 క్రికెట్లో భారత్పై ఏ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు ఇది. అలాగే, ఈ ఫార్మాట్లో యూఏఈకి ఇదే అత్యల్ప స్కోరు.
బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. యుఏఈ చివరి 8 వికెట్లను 28 పరుగులకే కోల్పోయింది. ఓపెనర్ అలీషాన్ షరాఫు 22 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మద్ వసీం 19 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్మెన్ రెండంకెల మార్కును దాటలేకపోయారు. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. శివమ్ దుబే 3 వికెట్లు పడగొట్టాడు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్- అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు వరుణ్ చక్రవర్తి.
యూఏఈ- మహ్మద్ వసీం (కెప్టెన్) , అలీషాన్ షరాఫు, రాహుల్ చోప్రా, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, మహ్మద్ జోహెబ్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖీ, మహ్మద్ రోహిద్, సిమర్జిత్ సింగ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








