AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: సిరీస్‌పై కన్నేసిన భారత్.. బ్రేక్ వేస్తానంటూ వర్షం వార్నింగ్? వెదర్ రిపోర్ట్ ఇదిగో

IND vs SA 2nd T20, Weather, Pitch Report: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండవ టీ20 జరుగుతున్న Gkebeharaలోని సెయింట్ జార్జ్ పార్క్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్‌లో వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 28 టీ20 మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 16 మ్యాచ్‌లు గెలిచింది.

IND vs SA: సిరీస్‌పై కన్నేసిన భారత్.. బ్రేక్ వేస్తానంటూ వర్షం వార్నింగ్? వెదర్ రిపోర్ట్ ఇదిగో
Ind Vs Sa 2nd T20i Weather
Venkata Chari
|

Updated on: Nov 10, 2024 | 3:51 PM

Share

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. గ్కెబెహరాలోని సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గెలుపొందాలనే ఉద్దేశ్యంతో ఇరు జట్లు రంగంలోకి దిగనున్నాయి. రాత్రి 8.30 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ రెండో మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, అంతకు ముందు సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియం పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది, రెండో మ్యాచ్‌లో జికెబెహరా వాతావరణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

వాతావరణ నివేదిక..

అక్యూవెదర్ ప్రకారం, భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశం లేదు. అయితే, రాత్రి 7 గంటల తర్వాత వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం 7 గంటలకు 58%, 8 గంటలకు 61% వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే వర్షం కురవకముందే మ్యాచ్ ముగియడంతో వర్షం పడుతుందనే ఆందోళన లేకుండా అభిమానులు మ్యాచ్‌ని వీక్షించవచ్చు.

ఇదిగో పిచ్ రిపోర్ట్..

ఇక పిచ్ గురించి మాట్లాడితే సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు మరింత సాయం చేస్తుంది. కాబట్టి ఆరంభంలో బ్యాట్స్‌మెన్ మరింత జాగ్రత్తగా ఉండాలి. పిచ్‌పై కొంత సమయం గడిపిన తర్వాత, బ్యాట్స్‌మెన్ సులభంగా పరుగులు సాధించగలరు. సెయింట్ జార్జ్ పార్క్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు గెలుపొందగా, రెండుసార్లు లక్ష్యాన్ని చేధించిన జట్టు విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్ ప్రధాన పాత్ర పోషించదు.

T20 మ్యాచ్ రిపోర్ట్..

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 16 మ్యాచ్‌లు గెలవగా, దక్షిణాఫ్రికా 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. దక్షిణాఫ్రికాలో ఆడిన 10 మ్యాచ్‌ల్లో భారత్ 7 మ్యాచ్‌లు గెలుపొందగా, దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌లు గెలిచింది.

భారత్ ప్రాబబుల్ స్క్వాడ్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..