AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: భారత్ వర్సెస్‌ పాకిస్తాన్ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌.. కొత్త డేట్ ఇదే.. మార్పునకు కారణమేంటంటే?

భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు. దీంతో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే బ్రాడ్‌కాస్టర్లకు సమస్యలు తలెత్తవచ్చు. కాగా మ్యాచ్‌ రీషెడ్యూల్‌ విషయాన్ని..

World Cup 2023: భారత్ వర్సెస్‌ పాకిస్తాన్ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌.. కొత్త డేట్ ఇదే.. మార్పునకు కారణమేంటంటే?
India Vs Pakistan
Basha Shek
|

Updated on: Jul 26, 2023 | 9:19 AM

Share

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ తేదీ మారవచ్చు. ఈ మ్యాచ్‌ని మళ్లీ రీషెడ్యూల్ చేయవచ్చు. దీనికి ప్రధాన కారణం దేవీ నవరాత్రులు. అక్టోబర్‌ 15 నుంచే నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రి సందర్భంగా గుజరాత్ అంతటా గర్బా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. అదే రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. ఇప్పుడీ విషయాన్నే బీసీసీఐ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు. దీంతో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే బ్రాడ్‌కాస్టర్లకు సమస్యలు తలెత్తవచ్చు. కాగా మ్యాచ్‌ రీషెడ్యూల్‌ విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నవరాత్రుల సమయంలో భారత్‌-పాకిస్థాన్‌ వంటి హై ప్రొఫైల్‌ మ్యాచ్‌లు నిర్వహించడం సమస్యలు తలెత్తవచ్చని భద్రతా సంస్థలు కూడా హెచ్చరించాయని ఆయన తెలిపారు.

త్వరలోనే నిర్ణయం..

గత నెలలోనే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం లక్ష మంది ప్రేక్షకులతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తో పాటు ఇక్కడ మరో 3 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, ఇందులో న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్‌లోని 10 నగరాల్లో ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు. మరోవైపు ప్రపంచకప్‌ను నిర్వహించే అన్ని క్రికెట్ సంఘాలకు బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాస్తూ జూలై 27న ఢిల్లీలో సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ భేటీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై చర్చ జరుగుతుందని, ఈ హై ప్రొఫైల్‌ మ్యాచ్ కొత్త తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కింగ్ కోబ్రాకు మేకోవర్ చేసిన హెయిర్ స్టైలిస్ట్
కింగ్ కోబ్రాకు మేకోవర్ చేసిన హెయిర్ స్టైలిస్ట్
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ