IND vs ENG 3rd Test Day 4: మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం.. సిరీస్ 1-1 తో సమానం

|

Updated on: Aug 28, 2021 | 5:25 PM

India vs England 3rd Test Day 4: మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

IND vs ENG 3rd Test Day 4: మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం.. సిరీస్ 1-1 తో సమానం
ind vs eng 3rd test: pujara, kohli

India vs England 3rd Test: 278 పరుగుల వద్ద టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగులతో మూడో టెస్టులో విజయం సాధించింది.

98 ఓవర్లో క్రైగ్ బౌలింగ్‌లో జడేజా చివరి మూడు బంతులను బౌండరీలు తరలించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 278/8, జడేజా (30), బుమ్రా(1) క్రీజులో ఉన్నారు.

టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ పరాజయానికి దగ్గరవుతోంది. ఇషాంత్ (2) రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 263/8, రవీంద్ర జడేజా(16), బుమ్రా క్రీజులో ఉన్నారు.

టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ పరాజయానికి దగ్గరవుతోంది. షమీ(6) రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 256/7, రవీంద్ర జడేజా(9), ఇషాంత్ శర్మ(2) క్రీజులో ఉన్నారు.

టీమిండియా పరాజయం అంచుకు చేరింది. పంత్(1) రూపంలో ఆరో వికెట్ కోల్పోయి ఓటమికి చాలా దగ్గరౌంది.

ఇంగ్లండ్ బౌలర్ల జోరు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్లు నిలవలేకపోతున్నారు. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పరాజయం వైపు నడుస్తున్నారు. పుజారా, కోహ్లీ పెవిలియన్ చేరిన వెంటనే రహానె(10) కూడా అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

90 ఓవర్లో విరాట్ కోహ్లీ మంచి జోరుతో వరుసగా రెండు ఫోర్లు బాది, తరువాత బాల్‌కే పెవిలియన్ చేరాడు. రాబిన్ ‌సన్ బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా ప్రస్తుతం237/4 వద్ద నిలిచింది.

టీమిండియా కెప్టెన్ ఈ సిరీస్‌లో తొలిసారి అర్థ సెంచరీ సాధించాడు. రాబిన్‌సన్ బౌలింగ్‌లో బౌండరీ సాధించి తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

46 పరుగుల వద్ద భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అండర్సన్ బౌలింగ్‌లో ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో వెంటనే టీమిండియా కెప్టెన్ రివ్యూ కోరాడు. బంతి బ్యాటుకు తాకకపోవడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. టీమిండియా ప్రస్తుతం 229/3 వద్ద ఉంది. కోహ్లీ 47, రహానె 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సెంచరీకి చేరువలో పుజారా(91) పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 4వ రోజు పరుగులేమీ సాధించకుండానే మూడో వికెట్ కోల్పోయింది. 

టీమిండియా, ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో తొలి నుంచి జోరూట్ సేన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేనను అత్యల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసి దెబ్బతీసింది. అనంతరం భారీ స్కోర్ సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచింది. ఇక మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు సాధించింది.

రెండో ఇన్నింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ రాహుల్(8) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(59) ఎంతో ఓపికగా ఆడి ఈ సిరీస్‌లో రెండో అర్థ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం పుజారా(91), కోహ్లీ(45) ఇద్దరు సంయమనం పాటిస్తూ క్రీజులో పాతుకపోయారు. పుజారా సెంచరీకి మరో 9 పరుగుల దూరంలో నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో తొలి అర్థసెంచరీ సాధించాలంటే మరో 5 పరుగులు సాధించాలి. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్, ఓవర్‌టన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక నేడు టీమిండియా ఎంతసేపు క్రీజులో నిలబడుతుందో చూడాలి. పుజారా, కోహ్లీ జోడిపైనే ఆశలన్నీ నెలకొన్నాయి. ఇంగ్లండ్‌పై ఆధిక్యం సంపాదించాలంటే టీమిండియా మరో 139 పరుగులు సాధించాల్సి ఉంది. కనీసం 200పైగా ఆధిక్యం సంపాదిస్తేనే ఈ టెస్టును కాపాడుకోగలదు. మరి నేడు ఏం జరుగుతుందో చూడాలి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Aug 2021 05:16 PM (IST)

    టీమిండియా ఆలౌట్

    278 పరుగుల వద్ద టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగులతో మూడో టెస్టులో విజయం సాధించింది.

  • 28 Aug 2021 05:14 PM (IST)

    జడేజా (30) ఔట్

    ఓటమి దిశగా సాగుతోన్న టీమిండియా… జడేజా(30) రూపంలో తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

  • 28 Aug 2021 05:11 PM (IST)

    98 ఓవర్లో వరుస ఫోర్లు

    98 ఓవర్లో క్రైగ్ బౌలింగ్‌లో జడేజా చివరి మూడు బంతులను బౌండరీలు తరలించాడు.

    ప్రస్తుతం టీమిండియా స్కోర్ 278/8, జడేజా (30), బుమ్రా(1) క్రీజులో ఉన్నారు.

  • 28 Aug 2021 05:00 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్

    టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ పరాజయానికి దగ్గరవుతోంది. ఇషాంత్ (2) రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

    ప్రస్తుతం టీమిండియా స్కోర్ 263/8, రవీంద్ర జడేజా(16), బుమ్రా క్రీజులో ఉన్నారు.

  • 28 Aug 2021 04:51 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్

    టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ పరాజయానికి దగ్గరవుతోంది. షమీ(6) రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది.

    ప్రస్తుతం టీమిండియా స్కోర్ 256/7, రవీంద్ర జడేజా(9), ఇషాంత్ శర్మ(2) క్రీజులో ఉన్నారు.

  • 28 Aug 2021 04:36 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    టీమిండియా పరాజయం అంచుకు చేరింది. పంత్(1) రూపంలో ఆరో వికెట్ కోల్పోయి ఓటమికి చాలా దగ్గరౌంది.

  • 28 Aug 2021 04:29 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

    ఇంగ్లండ్ బౌలర్ల జోరు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్లు నిలవలేకపోతున్నారు. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పరాజయం వైపు నడుస్తున్నారు. పుజారా, కోహ్లీ పెవిలియన్ చేరిన వెంటనే రహానె(10) కూడా అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 28 Aug 2021 04:22 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్

    90 ఓవర్లో విరాట్ కోహ్లీ మంచి జోరుతో వరుసగా రెండు ఫోర్లు బాది, తరువాత బాల్‌కే పెవిలియన్ చేరాడు. రాబిన్ ‌సన్ బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా ప్రస్తుతం237/4 వద్ద నిలిచింది.

  • 28 Aug 2021 04:18 PM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ

    టీమిండియా కెప్టెన్ ఈ సిరీస్‌లో తొలిసారి అర్థ సెంచరీ సాధించాడు. రాబిన్‌సన్ బౌలింగ్‌లో బౌండరీ సాధించి తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

  • 28 Aug 2021 04:12 PM (IST)

    అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసి గెలిచిన కోహ్లీ

    46 పరుగుల వద్ద భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అండర్సన్ బౌలింగ్‌లో ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో వెంటనే టీమిండియా కెప్టెన్ రివ్యూ కోరాడు. బంతి బ్యాటుకు తాకకపోవడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. టీమిండియా ప్రస్తుతం 229/3 వద్ద ఉంది. కోహ్లీ 47, రహానె 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 28 Aug 2021 03:57 PM (IST)

    సెంచరీ చేయకుండానే ఔట్..

    గత 12 ఇన్నింగ్స్‌లలో 50 పరుగుల మార్కును కూడా చేరుకోలేని చేతేశ్వర్ పుజారా.. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 91 పరుగులు సాధించాడు. పుజారా తన 19 వ సెంచరీ సాధించకుండానే రాబిన్ సన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 2019 జనవరిలో ఆస్ట్రేలియాపై సిడ్నీలో పుజారా (193) తన చివరి సెంచరీ సాధించాడు.

  • 28 Aug 2021 03:49 PM (IST)

    పుజారా వికెట్ కోల్పోయిన భారత్

    సెంచరీకి చేరువలో పుజారా(91) పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 4వ రోజు పరుగులేమీ సాధించకుండానే మూడో వికెట్ కోల్పోయింది.

  • 28 Aug 2021 03:11 PM (IST)

    ఆశలన్నీ కోహ్లీ, పుజారా జోడీపైనే..

    మూడో టెస్టులో టీమిండియా నిలబడాలంటే 4వ రోజు కచ్చితంగా రోజు మొత్తం పోరాడాల్సిందే. లేదంటే భారత్‌కు కచ్చితంగా ఓటమి తప్పదు. అందుకే కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారాల ఆట కీలకంగా మారింది. పుజారా 91, కోహ్లీ 45 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Published On - Aug 28,2021 3:04 PM

Follow us
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు