AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak : భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాకిస్థాన్ కొత్త డ్రామా

Ind vs Pak : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభమై జోరుగా సాగుతున్నప్పటికీ, క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్‌లో ఆడనిస్తోంది కానీ, భారత్‌తో తలపడటానికి మాత్రం ససేమిరా అంటోంది.

Ind vs Pak  : భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాకిస్థాన్ కొత్త డ్రామా
Ind Vs Pak 4500crore Loss
Rakesh
|

Updated on: Feb 09, 2026 | 6:25 AM

Share

Ind vs Pak : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభమై జోరుగా సాగుతున్నప్పటికీ, క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్‌లో ఆడనిస్తోంది కానీ, భారత్‌తో తలపడటానికి మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ఐసీసీ మధ్యవర్తిత్వం వహించినప్పటికీ, పాక్ క్రికెట్ బోర్డు పెట్టిన వింత షరతులు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటికీ, షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆదివారం (ఫిబ్రవరి 08) ఐసీసీ ప్రతినిధులు లాహోర్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పాక్ ప్రభుత్వం తరపున పీసీబీ మూడు ప్రధాన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. అయితే ఈ మూడు డిమాండ్లు పాకిస్థాన్ కోసం కాకుండా, టోర్నమెంట్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ కోసం ఉండటం గమనార్హం.

పాకిస్థాన్ పెట్టిన ఆ మూడు వింత షరతులు ఇవే

బంగ్లాదేశ్ జట్టు ఈసారి టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవడంతో, వారిపై సానుభూతి చూపిస్తూ పాకిస్థాన్ ఈ షరతులు పెట్టింది.

బంగ్లాదేశ్‌కు నష్టపరిహారం: టోర్నమెంట్ నుంచి తప్పుకున్నందుకు బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని భారీగా పెంచాలని పాక్ డిమాండ్ చేసింది.

ఆడకపోయినా ఫీజు చెల్లించాలి: బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనలేదు, కానీ వారు పాల్గొన్నట్లు భావించి వారికి ఇచ్చే పార్టిసిపేషన్ ఫీజును ఐసీసీ చెల్లించాలని కోరింది.

భవిష్యత్తులో ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్యం: బంగ్లాదేశ్‌కు భవిష్యత్తులో జరిగే ఐసీసీ టోర్నమెంట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇవ్వాలని పాక్ కోరింది.

బంగ్లాదేశ్ కోసం పాక్ ఎందుకు తాపత్రయపడుతోంది?

సాధారణంగా ఏ దేశమైనా తమ బోర్డు కోసం లేదా తమ ఆటగాళ్ల కోసం డిమాండ్లు పెడుతుంది. కానీ పాకిస్థాన్ ఇలా బంగ్లాదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడటం వెనుక పెద్ద వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తప్పుకున్న తర్వాతే పాక్ కూడా భారత్‌తో ఆడబోమని ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తున్నామని ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా, భారత్‌తో ఆడకపోవడాన్ని ఒక నైతిక పోరాటంగా చిత్రీకరించడానికి పాక్ ప్రయత్నిస్తోంది. అయితే, దీనివల్ల ఐసీసీకి వచ్చే భారీ ఆదాయానికి గండి పడే అవకాశం ఉండటంతో క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మ్యాచ్ జరుగుతుందా లేదా?

ప్రస్తుతానికి ఐసీసీ ఈ డిమాండ్లపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత్ ఇప్పటికే అమెరికాపై ఘనవిజయం సాధించి జోరుమీదుంది. మరోవైపు పాకిస్థాన్ ఇలాంటి రాజకీయ కారణాలతో మ్యాచ్‌కు దూరమైతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది. లేదా పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమైనా, ఫిబ్రవరి 15 లోపు ఈ డ్రామాకు తెరపడుతుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..