IND vs NZ: లెక్క సరిచేయాల్సిందే.. నేడు భారత్ vs న్యూజిలాండ్‌ బిగ్ ఫైట్‌.. పిచ్‌, వెదర్‌ రిపోర్టులివే

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ను ఓసారి ఖంగు తినిపించిన భారత్‌ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్‌ సైతం ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వేదిక అయిన వాంఖడే మైదానం బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌. ఇవాళ జరుగబోయే సెమీస్‌ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

IND vs NZ: లెక్క సరిచేయాల్సిందే.. నేడు భారత్ vs న్యూజిలాండ్‌ బిగ్ ఫైట్‌.. పిచ్‌, వెదర్‌ రిపోర్టులివే
India Vs New Zealand

Updated on: Nov 15, 2023 | 6:26 AM

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. జరుగబోయే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ను ఓసారి ఖంగు తినిపించిన భారత్‌ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్‌ సైతం ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వేదిక అయిన వాంఖడే మైదానం బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌. ఇవాళ జరుగబోయే సెమీస్‌ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాదగలరు. ఈ పిచ్‌పై మరోసారి భారీ స్కోర్‌ నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్‌పై శ్రీలంకతో జరిగిన లీగ్‌ దశ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు వాంఖడే పిచ్‌ పూర్తి స్థాయిలో అనుకూలించనుండడంతో టాస్‌ గెలిచిన జట్టు తప్పక బ్యాటింగ్‌ ఎంచుకుంటుంది. గతంలో ఇరు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్‌ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్‌పై భారత్‌ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు గతంలో 117 సందర్భాల్లో తలపడితే భారత్‌ 59, న్యూజిలాండ్‌ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌ టై కాగా.. ఏడు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి.

ఇవి కూడా చదవండి

గత రికార్డులివే..

ఇక వరల్డ్‌కప్‌ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిది సార్లు తలపడితే.. న్యూజిలాండ్‌ 4, భారత్‌ 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 ఎడిషన్‌లో ఈ ఇరు జట్లు తొలిసారి సెమీఫైనల్లో ఎదురెదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారత్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఫామ్‌ను బట్టి చూస్తే, న్యూజిలాండ్‌ కంటే టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. భారత్‌ అన్ని విభాగాల్లో న్యూజిలాండ్‌ కంటే మెరుగ్గా ఉంది. భారత బ్యాటింగ్‌ విభాగంలో ప్రతి ఒక్కరూ సూపర్‌ టచ్‌లో ఉన్నారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ టీమిండియాకు తిరుగులేదు. ఓవరాల్‌గా చూస్తే, ప్రస్తుతం భారత్‌ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని ఆటగాళ్లంతా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఈసారి భారత్‌ టైటిల్‌ గెలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

భారత్ దే ఆధిపత్యం.. కానీ..

ఇరుజట్లు:

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రీసద్ధ్ కృష్ణ.

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్మీ, విల్ సౌత్ యంగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..