Ind vs Eng: ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం.. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించిన పంత్.. సిరీస్ కైవసం..
Ind vs Eng: మాంచెస్టర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లండ్ ఇచ్చిన 259 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేధించి 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది...
Ind vs Eng: మాంచెస్టర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లండ్ ఇచ్చిన 259 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేధించి 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. 42.1 ఓవర్లలలో 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. రిషభ్ పంత్ ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 125 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్తో రాణించాడు. దీంతో భారత్ వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. పంత్ తర్వాత హార్ధిక్ పాండ్యే 71 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక అంతకుముందు టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. ఇంగ్లండ్ జట్టును 259 పరుగులకే కట్టడి చేశారు. హార్దిక్ పాండ్యా (4/24), యుజువేంద్ర చాహల్ (3/60) ఆతిథ్య జట్టును భారీస్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (60; 80 బంతుల్లో 3×4, 2×6) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్ జేసన్ రాయ్(41; 31 బంతుల్లో 7×4) రాణించాడు. చివర్లో క్రేగ్ ఓవర్టన్ (32; 33 బంతుల్లో 1×4, 1×6), డేవిడ్ విల్లే (18; 15 బంతుల్లో 1×4, 1×6) ఓ మోస్తరు పరుగులు చేశారు. రెండో మ్యాచ్లో ఓటమిపాలైన టీమిండియా మూడో మ్యాచ్లో దెబ్బకు దెబ్బ కొట్టింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..