AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd T20 : జోఫ్రా ఆర్చర్ ఈజ్ బ్యాక్.. భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం

IND vs ENG 2nd T20 : ఇంగ్లాండ్ రెండో టీ20 కోసం ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించగా జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా కూడా వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం అవకాశం ఇస్తుందా అనే ఆసక్తి నెలకొంది. సంజూ శాంసన్ ఫామ్, భారత అంచనా జట్టుపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

IND vs ENG 2nd T20 : జోఫ్రా ఆర్చర్ ఈజ్ బ్యాక్.. భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
IND vs ENG 2nd T20
Rakesh
|

Updated on: Jul 04, 2026 | 7:34 AM

Share

IND vs ENG 2nd T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందే మైదానం వెలుపల వ్యూహాల పర్వం మొదలైంది. మాంచెస్టర్ వేదికగా జులై 4న జరగబోయే ఈ కీలక పోరు కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఒక అడుగు ముందే వేసి, తమ తుది జట్టును అధికారికంగా ప్రకటించేసింది. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయినప్పటికీ, ఈ రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ముందంజ వేయాలని ఇంగ్లీష్ జట్టు పట్టుదలగా ఉంది. అందుకోసమే భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చడానికి ఇంగ్లాండ్ యాజమాన్యం తమ వ్యూహాలను పూర్తిగా మార్చేసింది.

జోఫ్రా ఆర్చర్ ఈజ్ బ్యాక్

ప్రకటించిన జట్టు వివరాల ప్రకారం ఇంగ్లాండ్ తమ తుది ఎలెవన్‌లో రెండు భారీ మార్పులు చేసింది. జట్టులో అందరికంటే ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ జట్టులోకి తిరిగి వస్తున్నాడు. అతడి రాకతో ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. ఆర్చర్‌తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ కూడా ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ ఇద్దరు ఎక్స్‌ప్రెస్ పేసర్లు భారత టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూ?

ఇంగ్లాండ్ టీమ్ తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్న తరుణంలో, భారత మేనేజ్‌మెంట్ ఎలాంటి సమాధానం ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ పేస్ దాడిని తిప్పికొట్టడానికి టీమిండియా కూడా ఒక పెద్ద ప్లాన్‎తోనే రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించిన యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేయాలని మేనేజ్‌మెంట్ గట్టిగా ఆలోచిస్తోంది. మాంచెస్టర్ మైదానమే వైభవ్ అరంగేట్రానికి వేదిక కానుందని క్రికెట్ వర్గాల అంచనా.

సంజూ శాంసన్ వరుస వైఫల్యాలు

యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కడానికి ముఖ్య కారణం సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్ లేమి అని చెప్పక తప్పదు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లతో పాటు, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ సంజూ పూర్తిగా విఫలమయ్యాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 6 మాత్రమే. వరుసగా లభిస్తున్న అవకాశాలను సంజూ సద్వినియోగం చేసుకోలేకపోవడంతో, అతడి స్థానంలో వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించి, ఇషాన్ కిషన్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.

శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్

వర్షం కారణంగా రద్దయిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 189 పరుగులు చేసినప్పటికీ, బ్యాటర్ల స్ట్రైక్ రేట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. తిలక్ వర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు సాధించినప్పటికీ.. అవి వారి కెరీర్‌లోనే అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీలుగా రికార్డుకెక్కాయి. అయితే చివర్లో వచ్చిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే కేవలం కొన్ని బంతుల్లోనే 42 పరుగులతో విరుచుకుపడటంతోనే భారత స్కోరు 180 మార్కును దాటగలిగింది. ఈ నెమ్మదైన బ్యాటింగ్ ధోరణిని మార్చడానికే వైభవ్ లాంటి మెరుపు ఆటగాడి అవసరం జట్టుకు ఏర్పడింది.

భారత జట్టు అంచనా ప్లేయింగ్ ఎలెవన్

రెండో టీ20 మ్యాచ్ కోసం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వస్తే, ఓపెనింగ్ స్థానంలో మార్పు మినహా మిగిలిన జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై మట్టికరిపించడానికి భారత్ బరిలోకి దించబోయే అంచనా జట్టు ఇలా ఉంది:

భారత అంచనా జట్టు: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us