IND Vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ ఔట్.? కుప్పిగంతులు వేస్తే పాక్‌కు పగిలిపోయినట్టే

|

Jul 11, 2024 | 7:07 PM

ఏది తెగే దాకా లాగకూడదు.. ఇది పెద్దలు చెప్పే మాట.. ఇక ఇప్పుడు ఈ మాటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ఆ క్రికెట్ బోర్డు తెరపైకి తీసుకొచ్చిన ఓ అంశంపై బీసీసీఐకి తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. పెడితే హైబ్రిడ్ మోడల్ పెట్టాలి.. లేదంటే పాక్ వచ్చేది లేదు అంటోంది బీసీసీఐ. అటు పాక్ కూడా తగ్గేదేలే..

IND Vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ ఔట్.? కుప్పిగంతులు వేస్తే పాక్‌కు పగిలిపోయినట్టే
India Vs Pak
Follow us on

ఏది తెగే దాకా లాగకూడదు.. ఇది పెద్దలు చెప్పే మాట.. ఇక ఇప్పుడు ఈ మాటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ఆ క్రికెట్ బోర్డు తెరపైకి తీసుకొచ్చిన ఓ అంశంపై బీసీసీఐకి తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. పెడితే హైబ్రిడ్ మోడల్ పెట్టాలి.. లేదంటే పాక్ వచ్చేది లేదు అంటోంది బీసీసీఐ. అటు పాక్ కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో షెడ్యూల్ ఇలా ఉండబోతోందని.. పాకిస్తాన్ ఐసీసీ అనుమతి కోరుతూ ముసాయిదా షెడ్యూల్ పంపించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ ప్రారంభమై మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో టీమిండియా మ్యాచ్‌లు జరగనున్నాయి. పీసీబీ ప్రకారం, భారత జట్టు తొలి రౌండ్‌లో లాహోర్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే తమకు ఆ షెడ్యూల్ నచ్చలేదని.. టోర్నీలో తమ మ్యాచ్‌లను తరలించాల్సిందిగా ఇండియన్ క్రికెట్ కౌన్సిల్‌ను అభ్యర్ధించింది బీసీసీఐ. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే హక్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఉంది. అయితే పాకిస్థాన్‌లో టోర్నీ జరిగితే భారత జట్టు పాల్గొనదని బీసీసీఐ తెలిపింది.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

భారత ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా పాకిస్థాన్‌లో టోర్నీ ఆడలేం. కాబట్టి భారత మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించాలని బీసీసీఐ అడుగుతోంది. దీని ప్రకారం త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మ్యాచ్‌లను శ్రీలంక లేదా యూఏఈకి తరలించే అవకాశం ఉంది. ఐసీసీ టోర్నమెంట్‌లను తరలించాలంటే, నిర్దిష్ట కారణాలు ఉండాలి. ఇక్కడ టోర్నీని మార్చడానికి బీసీసీఐ భద్రతా కారణాలను తెలిపింది. అలాగే భారత జట్టు టోర్నీ నుంచి వైదొలగితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే టీమిండియా మ్యాచ్‌లు యూఏఈ లేదా శ్రీలంకలో జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ మన జట్టు తప్పుకున్నా ఆశ్చర్యం అక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

హైబ్రిడ్ ఫార్మాట్‌లో టోర్నీ:

మొత్తం టోర్నీని మార్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించకపోతే, ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. అంటే యూఏఈ లేదా శ్రీలంక భారత్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వవచ్చు. ఎందుకంటే గతం ఆసియా కప్ కూడా ఇదే మోడల్‌లో జరిగింది. దాని ప్రకారం భారత జట్టు శ్రీలంకలో ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు, టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు వెళ్ళేది లేదని స్పష్టం చేసింది. కాబట్టి హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సిన అవసరాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎదుర్కొంటోంది.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే జట్లు:

  • భారత్
  • దక్షిణాఫ్రికా
  • ఆస్ట్రేలియా
  • న్యూజిలాండ్
  • పాకిస్తాన్ (ఆతిథ్య దేశం)
  • ఆఫ్ఘనిస్తాన్
  • ఇంగ్లాండ్
  • బంగ్లాదేశ్

ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..