AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: అమితాబ్ తర్వాత రజనీకాంత్‌కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్’.. టాలీవుడ్‌లో ఎవరికంటే..

Rajinikanth: అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, తలైవా రజనీకాంత్ తర్వాత 'గోల్డెన్ టిక్కెట్' అందజేసారు. ఐసిసి ప్రపంచ కప్ 2023 గోల్డెన్ టిక్కెట్‌ను బిసిసిఐ కార్యదర్శి జై షా తలైవాకు అందజేశారు. ప్రపంచ కప్‌లోని ప్రతి మ్యాచ్‌ను వీఐపీ స్పెషల్ గ్యాలరీలో కూర్చుని ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ గోల్డెన్ టికెట్ మీకు ఉచిత ప్రవేశాన్ని అందించడమే కాకుండా, స్టేడియం లోపల అదనపు సౌకర్యాలను కూడా అందిస్తుంది.

ICC World Cup 2023: అమితాబ్ తర్వాత రజనీకాంత్‌కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్’.. టాలీవుడ్‌లో ఎవరికంటే..
Bcci Presents Golden Ticket
Sanjay Kasula
|

Updated on: Sep 19, 2023 | 6:19 PM

Share

ప్రపంచ కప్ 2023కి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఇది అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ముందు బీసీసీఐ స్పెషల్ ఫోకస్ పెట్టింది. భారత్‌లోని గొప్ప స్టార్లకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లు ఇస్తోంది. బాలీవుడ్, క్రికెట్ లెజెండరీకి బోర్డు గోల్డెన్‌ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్‌ కూడా ఈ  వరసలో చేరారు. ఆ అరుదైన గౌరవాన్నిదక్కించుకున్నారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, తలైవా రజనీకాంత్ తర్వాత ‘గోల్డెన్ టిక్కెట్’ అందజేసారు. ఐసిసి ప్రపంచ కప్ 2023 గోల్డెన్ టిక్కెట్‌ను బిసిసిఐ కార్యదర్శి జై షా తలైవాకు అందజేశారు.

తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్‌ కంటే ముందే బిసిసిఐ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌లకు గోల్డెన్ టిక్కెట్లు అందజేసింది. ఈసారి రజనీకాంత్‌కే ఈ గోల్డెన్ టిక్కెట్టు దక్కింది. బీసీసీఐ ఈ స్పెషల్ టిక్కెట్లను మరింత మంది వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

దక్షిణాది సూపర్‌స్టార్ ప్రపంచ కప్‌లోని ప్రతి మ్యాచ్‌ను వీఐపీ స్పెషల్ గ్యాలరీలో కూర్చుని ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ గోల్డెన్ టికెట్ మీకు ఉచిత ప్రవేశాన్ని అందించడమే కాకుండా, స్టేడియం లోపల అదనపు సౌకర్యాలను కూడా అందిస్తుంది.

నిజానికి BCCI అధికారిక ట్విట్టర్(X)లో ఒక ఫోటోను షేర్ చేసింది.  సెక్రటరీ జై షా ICC వరల్డ్ కప్ 2023 గోల్డెన్ టిక్కెట్‌ను రజనీకాంత్‌కి అందజేస్తున్న ఫోటో ఇక్కడ మనం చూడవచ్చు. క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చారు. “సినిమా పైన ఎవరున్నారో! బీసీసీఐ సెక్రటరీ జై షా రజనీకాంత్‌కు గోల్డెన్ టిక్కెట్‌ను అందజేసారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని స్టార్‌లలో ఒకరు. ఆయన భాష, సంస్కృతిని దాటి లక్షలాది మంది హృదయాలను చేరారు. కాబట్టి మేము నిజంగా గర్విస్తున్నాం. తలైవా అతిథి అని.”

పని గురించి మాట్లాడుతూ.. ‘జిల్లార్’ సూపర్ సక్సెస్ తర్వాత.. రజనీకాంత్ తన తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. ‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా నటించనుంది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ కూడా చేతిలో ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి