
భారత్తో బర్మింగ్హామ్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో 315 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు కీలక సమయంలో ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో షమీ విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (22: 31 బంతుల్లో 3×4) వికెట్ చేజార్చుకోగా.. అనంతరం కాసేపు నిలకడగా ఆడిన మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ (33: 38 బంతుల్లో 4×4) హార్దిక్ బౌలింగ్లో కోహ్లీకి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక 23వ వేసిన చాహల్ చివరి బంతికి ముష్పికర్ రహీమ్ 24 ను పెవిలియన్క పంపాడు. 23 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 122/3. షకిబుల్ హసన్ 40 పరుగులతో లిటాన్ దాస్ అసలు పరుగులు ఏమి చెయ్యకుండా క్రీజులో ఉన్నారు.