
ఆద్యంతం ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ముందు ఇండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న టీమిండియా.. రీప్లెస్లను చేసినట్టు తెలుస్తోంది. ఆల్ రౌండర్ జాదవ్, స్పిన్నర్ చాహల్ను ఇవాళ జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్కు పక్కన పెట్టినట్లు సమాచారం. వీరిద్దరి స్థానంలో జడేజా, భువనేశ్వర్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ను ఎదుర్కోవాలంటే పేసర్లే ప్రధానమని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో జడేజా, భువనేశ్వర్ను తీసుకోనున్నారని సమాచారం.