Video: ‘పాక్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. ప్రొఫెషనల్ డాక్టర్లు కావాలి’: మాజీ ప్లేయర్ విమర్శలు

Pakistan Cricket Team: T20 ప్రపంచ కప్ 2024లో US జట్టుపై అవమానకరమైన ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌పై క్లీన్ స్వీప్ అయింది. ఈ అవమానకరమైన ఓటమి కారణంగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు దాని అభిమానుల కోపానికి గురి అయ్యింది. అలాగే జట్టులోని మాజీ అనుభవజ్ఞుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.

Video: 'పాక్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. ప్రొఫెషనల్ డాక్టర్లు కావాలి': మాజీ ప్లేయర్ విమర్శలు
Pakistan Cricket Team
Follow us

|

Updated on: Sep 17, 2024 | 9:34 PM

Pakistan Cricket Team: ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కారణంగా.. వరుస ఓటములతో షాక్‌కు గురైన పాక్ జట్టు.. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. T20 ప్రపంచ కప్ 2024లో US జట్టుపై అవమానకరమైన ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌పై క్లీన్ స్వీప్ అయింది. ఈ అవమానకరమైన ఓటమి కారణంగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు దాని అభిమానుల కోపానికి గురి అయ్యింది. అలాగే జట్టులోని మాజీ అనుభవజ్ఞుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. కాగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐసీయూలో ఉందని మాజీ సీనియర్ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరుసగా 10 పరాజయాలు..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ సొంత మైదానంలో ఆడిన గత 10 టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. ఈ 10 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 4 మ్యాచ్‌లు డ్రా చేసుకోగా, 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాకిస్థాన్ చివరిసారిగా 2021లో దక్షిణాఫ్రికాపై సొంతగడ్డపై టెస్టు గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ 3-0తో పాకిస్థాన్‌పై, ఆస్ట్రేలియాపై 1-0తో, బంగ్లాదేశ్‌పై 2-0తో గెలుపొందాయి.

ఇవి కూడా చదవండి

రషీద్ లతీఫ్ ఏం చెప్పాడంటే?

మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో పాకిస్థాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది. పాక్ బృందానికి ప్రొఫెషనల్ వైద్యులు అవసరం. స్వదేశంలో గానీ, విదేశీ గడ్డపై గానీ జట్టు సరిగా ఆడలేకపోతోంది. జట్టు వ్యవహారాలను నిర్వహించడానికి సాంకేతికంగా నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉంది. అది శారీరక శిక్షణ లేదా ఆర్థిక నిర్వహణ. పాక్ జట్టు పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోకపోతే.. పాకిస్థాన్ క్రికెట్ ప్రమాదంలో పడుతుందని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

బంగ్లాదేశ్‌పై తొలి ఓటమి..

క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాక్ జట్టు ఓడిపోలేదు. అందుకే, బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు పాక్ క్రికెట్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్‌పై ఆ జట్టు విజయం సాధించి ఉంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకోవడం సులువుగా ఉండేది. కానీ, పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ నిరాశాజనక ప్రదర్శనతో ఓడిపోయింది. దీంతో పాక్‌ క్రికెట్‌ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..